




Best Web Hosting Provider In India 2024

కడప జిల్లాలో తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి
కడప జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. గువ్వల చెరువు ఘాట్లో కారు-లారీ ఢీకొన్నాయి. రాయచోటి నుంచి కడప వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు, చిన్నారి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం (unsplash)
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ- కారు ఢీకొన్న ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందారు. సీ.కే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఐదుగురు స్పాట్లోనే చనిపోయారు. రాయచోటి నుంచి కారులో కడపకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ఓ చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంబంధిత కథనం
టాపిక్
KadapaRoad AccidentAndhra Pradesh NewsRayalaseema
మరిన్ని ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.