జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై బిగ్​ అప్డేట్​- ఆన్సర్​ కీ విడుదల ఎప్పుడంటే..

Best Web Hosting Provider In India 2024


జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025పై బిగ్​ అప్డేట్​- ఆన్సర్​ కీ విడుదల ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025కి సంబంధించిన అభ్యర్థులకు కీలక అలర్ట్​! ఆన్సర్​ కీ విడుదల డేట్​ని అధికారులు ప్రకటించారు.​ ఆన్సర్ కీని jeeadv.ac.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళితే..

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025 ఆన్సర్​ కీ ఎప్పుడంటే..

2025 మే 22న ఇండియన్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ కాన్​పూర్​) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్​డ్​ని నిర్వహించింది. అనంతరం, ప్రశ్నపత్రాలు, అభ్యర్థుల సమాధానాలను విడుదల చేసింది. ఇక ఇప్పుడు సంస్థ ఆన్సర్ కీని విడుదల చేయనుంది. జేఈఈ అడ్వాన్స్​డ్ ఆన్సర్ కీని అభ్యర్థులు jeeadv.ac.in అధికారిక వెబ్​సైట్​ నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

అధికారిక సమాచారం ప్రకారం జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 ఆన్సర్ కీని మే 26న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025: ముఖ్యమైన తేదీలు..

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 వెబ్​సైట్​లో అందుబాటులో ఉండే అభ్యర్థుల రెస్పాన్స్​ షీట్స్​ కాపీ: గురువారం, మే 22 (సాయంత్రం 5 గంటలకు)

ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల: సోమవారం, మే 26 (ఉదయం 10 గంటలకు)

ప్రొవిజినల్ ఆన్సర్ కీలపై ఫీడ్​బ్యాక్ – కామెంట్స్​: సోమవారం, మే 26,(ఉదయం 10) నుంచి మంగళవారం, మే 27 (సాయంత్రం 5) వరకు.

జేఈఈ అడ్వాన్స్​డ్ 2025 ఫైనల్ ఆన్సర్ కీ- ఫలితాల ప్రకటన: సోమవారం, జూన్ 2 (ఉదయం 10 గంటలకు)

ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటి) 2025 కోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్: సోమవారం, జూన్ 2 (మంగళవారం, 10)

జాయింట్ సీట్ అలాకేషన్ (జేఓఎస్ఏఏ) 2025 ప్రక్రియ ప్రారంభ టెంటెటివ్​ డేట్​: మంగళవారం, జూన్ 3 (సాయంత్రం 5 గంటలకు)

ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ టెస్ట్ (ఏఏటీ) 2025: గురువారం, జూన్ 5 (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు)

ఏఏటీ 2025 ఫలితాల ప్రకటన: జూన్ 8 (ఆదివారం సాయంత్రం 5 గంటలకు)

జేఈఈ అడ్వాన్స్​డ్​ 2025ను ఐఐటీ కాన్పూర్​ రెండు షిఫ్టుల్లో నిర్వహించింది. జేఈఈ అడ్వాన్స్​డ్ పేపర్ 1 ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరిగాయి.

జోన్​ల వారీగా అభ్యర్థుల సంఖ్య..

ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్​డ్​​కు మొత్తం 187223 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు.

ఐఐటీ బాంబే జోన్​ : 37002 మంది అభ్యర్థులు

ఐఐటీ దిల్లీ జోన్: 34069 మంది అభ్యర్థులు

ఐఐటీ గౌహతి జోన్: 12802 మంది అభ్యర్థులు

ఐఐటీ హైదరాబాద్ జోన్: 45622 మంది అభ్యర్థులు

ఐఐటీ కాన్పూర్ జోన్: 21019 మంది అభ్యర్థులు

ఐఐటీ ఖరగ్​పూర్ జోన్: 19302 మంది అభ్యర్థులు

ఐఐటీ రూర్కీ జోన్: 17407 మంది అభ్యర్థులు

అభ్యర్థులు అధికారిక అప్డేట్స్ కోసం జేఈఈ అడ్వాన్స్​డ్​ వెబ్​సైట్​ని క్రమం తప్పకుండా సందర్శించాలి.

దేశంలో ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువు కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్​, జేఈఈ అడ్వాన్స్​డ్​ కోసం ప్రతి యేటా లక్షల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటారు. దేశంలో అత్యంత కఠినమైన పరీక్షల్లో ఇదొకటి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link