గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ – ఉత్తమ చిత్రంగా కల్కి, బెస్ట్‌ హీరో అల్లు అర్జున్, లిస్ట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

గద్దర్ అవార్డులు ప్రకటించిన తెలంగాణ సర్కార్ – ఉత్తమ చిత్రంగా కల్కి, బెస్ట్‌ హీరో అల్లు అర్జున్, లిస్ట్ ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించింది. 2024 ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి నిలిచింది. ఉత్తమ రెండోవ చిత్రంగా పోట్టేల్, మూడవ చిత్రం లక్కీ భాస్కర్ స్థానం దక్కించుకుంది. ఈ మేరకు జ్యూరీ కమిటీ వివరాలను వెల్లడించింది. ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2) పేరు ఖరారైంది.

గద్దర్ అవార్డుల ప్రకటన

2024 ఏడాదికి సంబంధించిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులపై ప్రభుత్వం ప్రకటన చేసింది. ఈ మేరకు ఏర్పాటైన జ్యూరీ కమిటీ వివరాలను గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా పలు విభాగాల్లో అవార్డులు దక్కించుకున్న చిత్రాల వివరాలను పేర్కొంది.

గద్దర్ అవార్డులు(2024) – జాబితా వివరాలు:

  • ఉత్తమ మొదటి చిత్రంగా కల్కి.
  • ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్.
  • ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్.
  • ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ (పుష్ప 2).
  • ఉత్తమ నటిగా నివేదిత థామస్ (35).
  • ఉత్తమ దర్శకుడుగా నాగ్ అశ్విన్.
  • ఉత్తమ గాయని శ్రేయ ఘోషల్.
  • బెస్ట్‌ స్టోరీ రైటర్‌-శివ పాలడుగు.
  • బెస్ట్‌ స్ర్కీన్‌ప్లే -వెంకీ అట్లూరి.
  • బెస్ట్‌ కొరియోగ్రాఫర్‌- గణేశ్‌ ఆచార్య.
  • బెస్ట్‌ యాక్షన్‌ కొరియోగ్రాఫర్‌- చంద్రశేఖర్‌.
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డు- దుల్కర్‌ సల్మాన్‌ (లక్కీ భాస్కర్).
  • స్పెషల్‌ జ్యూరీ అవార్డు- అనన్య నాగళ్ల (పొట్టేల్‌).

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం… ప్రజా గాయకుడు గద్దర్ పేరిట అవార్జులను ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ జ్యూరీ(కమిటీ)కి ఛైర్మన్ గా టాలీవుడ్ సీనియర్ నటి జయసుధను ఎంపిక చేశారు. కమిటీలో సభ్యులుగా 15 మందికి అవకాశం కల్పించారు.

ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుల కోసం పలు కేటగిరీల కింద నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని స్క్రీనింగ్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత…. తాజాగా జ్యూరీ కమిటీ అవార్డుల ప్రకటన వివరాలను వెల్లడించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నంది అవార్డులు ఇచ్చేవారు… ప్రస్తుతం తెలంగాణలో గద్దర్ అవార్జులను ఇస్తున్నారు.

ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది – జయసుధ

దాదాపు 14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినిమా అవార్డులను ప్రకటించారు. అవార్డుల వివరాలను జ్యారీ కమిటీ ఛైర్మన్‌ జయసుధ, ఎఫ్ డీసీ ఛైర్మన్‌ దిల్‌ రాజు వివరించారు. ఈ సందర్భంగా జయసుధ మాట్లాడుతూ…. అవార్డుల ఎంపికపై తమకు ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. కమిటీ ఏకగ్రీవంగా అవార్డులను ఎంపిక చేసిందని చెప్పారు. అవార్డులకు గెలుచుకున్న వారికి అభినందనలు తెలిపారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Telugu MoviesGaddarTelangana NewsGovernment Of TelanganaAllu ArjunPushpa 2 The RuleKalki 2898 Ad
మరిన్ని తెలుగు సినిమా న్యూస్, టీవీ సీరియల్స్, ఓటీటీ న్యూస్, మూవీ రివ్యూలు, బాలీవుడ్, హాలీవుడ్ తాజా అప్‌డేట్స్ చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024