చండీగఢ్ లో 40 ఏళ్ల కోవిడ్ 19 పేషెంట్ మృతి; దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

Best Web Hosting Provider In India 2024


చండీగఢ్ లో 40 ఏళ్ల కోవిడ్ 19 పేషెంట్ మృతి; దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

Sudarshan V HT Telugu

కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ తో రెండు రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. రోగికి తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలు కనిపించాయి. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేస్తున్నారు.

కోవిడ్ 19 పేషెంట్ మృతి

చండీగఢ్ లోని సెక్టార్ 32లో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH)లో కోవిడ్-19 వైరస్ కారణంగా 40 ఏళ్ల రోగి బుధవారం మృతి చెందాడు. మృతుడు లుధియానా నుంచి రిఫర్ చేయగా తమ వద్దకు వచ్చాడని, తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో రెండు రోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారని జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి తెలిపారు. మంగళవారం కొవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ కాగా, బుధవారం తెల్లవారు జామున మృతి చెందాడు.

కోవిడ్ 19 నిర్ధారణ

ఈ ఘటనపై జీఎంసీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ జీపీ థామి మాట్లాడుతూ ‘‘నిన్న ఓ పేషెంట్ వచ్చాడు. ఆయనకు కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఇవాళ తెల్లవారు జామున 4 గంటల సమయంలో మృతి చెందాడు. అతడు యూపీలోని ఫిరోజాబాద్ కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి. తీవ్రమైన శ్వాసకోశ సమస్య, జ్వరంతో బాధపడుతున్న ఆయనను లుధియానా నుంచి ఇక్కడికి రెఫర్ చేశారు’’ అని తెలిపారు.

ఐసోలేషన్ వార్డు సిద్ధం

చండీగఢ్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు థామి తెలిపారు. ‘ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశాం. కొవిడ్ 19 తో బాధపడుతూ మరింత మంది ఇక్కడికి వస్తారని అనుమానిస్తున్నాం’ అని థామీ పేర్కొన్నారు.

పెరుగుతున్న కోవిడ్ -19 కేసులు

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ -19 కేసులు మళ్లీ నమోదయ్యాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) ధృవీకరించింది. సోమవారం, భారతదేశంలో 1,009 యాక్టివ్ కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. వాటిలో మొత్తం 430 యాక్టివ్ కేసులతో కేరళ అగ్రస్థానంలో ఉండగా, తదుపరి స్థానాల్లో మహారాష్ట్ర (209), ఢిల్లీ (104), గుజరాత్ (83), కర్ణాటక (47) రాష్ట్రాలు ఉన్నాయి.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link