




Best Web Hosting Provider In India 2024

ఏపీలో రేషన్ షాపులు పునఃప్రారంభం – పంపిణీ తేదీలు, టైమింగ్స్ వివరాలివే
ఏపీలో మళ్లీ పాత విధానంలో రేషన్ పంపిణీ జరగనుంది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 29,796 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ చేయనున్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే ఇంటివద్దే రేషన్ పంపిణీ చేస్తారు.
ఏపీలో మళ్లీ రేషన్ దుకాణాల వ్యవస్థ మళ్లీ ప్రారంభమైంది. వాహనాల ద్వారా పంపిణీని రద్దు చేసిన కూటమి ప్రభుత్వం…. నేటి నుంచి రేషన్ దుకాణాల ద్వారానే సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
రేషన్ షాపులు పునఃప్రారంభం – ముఖ్య వివరాలు
- ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లోనే బియ్యం, పంచదార, ఇతర రేషన్ సరకులను పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
- ఎండీయూ వాహనాలను నిలిపివేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో… మండల కేంద్రాల నుంచి స్టాక్ ను రేషన్ షాపులకు తరలించారు.
- నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా 29,796 చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయనున్నారు.
- ఆదివారాల్లో కూడా సరుకులు పంపిణీ చేయబడతాయని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
- నెలకు మొదటి 15 రోజులు ఉదయం, సాయంత్రం వేళల్లో సరుకులు పంపిణీ చేయనున్నారు.
- ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు… సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలలో సరుకులు అందిస్తారు. వీలైన సమయంలో కార్డుదారులు వెళ్ళి రేషన్ తెచ్చుకోవచ్చు.
- దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు మాత్రమే ఇంటి వద్ద రేషన్ అందిస్తారు.
- 1 కోటి 46 లక్షల కుటుంబాలకి నిత్యావసర వస్తువులు నిరాటంకంగా అందేలా ఏర్పాట్లు చేసినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
- ప్రతీ నెలా దాదాపు 16 లక్షల మంది దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకి ఇంటికే రేషన్ సరుకులు అందించే ఏర్పాటు చేసినట్లు మనోహర్ చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ డోర్ డెలివరీ పేరుతో రేషన్ దుకాణాల పరిధిలోని కూడళ్లలో రేషన్ పంపిణీ జరిగేది. ప్రతి రేషన్ దుకాణం పరిధిలో నిర్దేశిత పాయింట్లో రేషన్ వాహనాల ద్వారా ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేసేవారు. గతంలో రేషన్ దుకాణాల్లో కార్డుదారులే వెళ్లి సరుకులు తెచ్చుకునే వారు.
వాహనాలతో రేషన్ పంపిణీతో బియ్యం పక్క దారి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధానంతో లబ్ధిదారులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో వాహనాల ద్వారా రేషన్ డెలివరీ విధానాన్ని రద్దు చేస్తూ నిర్ణయం వాతీసుకుంది. పాత విధానంలోనే సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.
సంబంధిత కథనం
టాపిక్