



Best Web Hosting Provider In India 2024
నీట్ పీజీ 2025 వాయిదా.. కొత్త పరీక్ష తేదీపై త్వరలో ప్రకటన
నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్(NBEMS) జూన్ 15, 2025న జరగాల్సిన NEET-PG 2025 పరీక్షను వాయిదా వేసింది. తదుపరి పరీక్ష ఎప్పుడు అనేది తెలియాల్సి ఉంది.
ఎన్బీఈఎంఎస్ నీట్ పీజీ 2025ను వాయిదా వేసింది. దీనికి సంబంధించి బోర్డు అధికారిక నోటీసు జారీ చేసింది. దీనిలో ‘మరిన్ని పరీక్షా కేంద్రాలు, అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి పరీక్షను వాయిదా వేస్తున్నాం.’ అని తెలిపింది.
మెుదట జూన్ 15, 2025న నిర్వహించాల్సి ఉండేది. అయితే నీట్ పీజీ 2025ను రెండు షిఫ్టుల్లో కాకుండా సింగిల్ షిఫ్ట్లో నిర్వహించాలని సుప్రీంకోర్టు గత నెలలో ఆదేశించింది. ఒకే షిఫ్టులో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని, పూర్తి పారదర్శకత పాటించేలా చూడాలని ధర్మాసనం అధికారులను ఆదేశించింది. నీట్-పీజీ 2025 పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహించాలన్న నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
నీట్ పీజీ 2025 నిర్వహణకు సవరించిన తేదీని త్వరలోనే ప్రకటిస్తామని ఎన్బీఈఎంఎస్ తన నోటీసులో పేర్కొంది. పరీక్ష సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్పులను బోర్డు విడుదల చేసే ముందే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. నీట్ పీజీ ఎగ్జామ్ 2025 గురించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో ఒకే షిఫ్ట్ లో పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ చర్య అన్ని అభ్యర్థులకు పరీక్ష పరిస్థితులను ప్రామాణీకరించడం, మునుపటి పలు షిఫ్ట్ పరీక్షలలో వ్యత్యాసాల గురించి లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. కొత్త పరీక్షల షెడ్యూల్, ఇతర సూచనలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభ్యర్థులు అధికారిక NBEMS వెబ్సైట్ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి.
Best Web Hosting Provider In India 2024
Source link