




Best Web Hosting Provider In India 2024
‘తల్లివేనా అసలు?’- బాయ్ఫ్రెండ్ చేత మైనర్ కూతురిని రేప్ చేయించిన మహిళ.. ఎనిమిదిసార్లు!
ఉత్తరాఖండ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్పై 8సార్లు అత్యాచారం జరిగింది. చేయించింది ఆమె సొంత తల్లి! చేసింది.. ఆ మహిళ బాయ్ఫ్రెండ్, అతని సహచరుడు. కాగా, ఆ మహిళ ఒక బీజేపీ నేత. ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత ఆమెను బీజేపీ తొలగించింది.
ఉత్తరాఖండ్లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ బీజేపీ బహిష్కృత నేత.. తన ప్రియుడు, మరో పురుషుడి చేత సొంత కూతురిని రేప్ చేయించింది. తల్లి సమక్షంలోనే మైనర్పై 8సార్లు అత్యాచారం జరిగింది!
అసలేం జరిగిందంటే..
సదరు మహిళ కొంతకాలం క్రితం తన భర్తతో విడిపోయింది. అప్పటి నుంచి తన ప్రియుడితో కలిసి హోటళ్లల్లో ఉంటోంది. మాజీ భర్త దగ్గర ఉన్న తన 13ఏళ్ల కూతురును తరచూ కలుస్తూ ఉంటుంది.
అయితే సొంత కూతురుకు ఆ తల్లి నరకం చూపించింది! కలిసినప్పుడల్లా మద్యం తాగించేది. తన బాయ్ఫ్రెండ్, అతని సహచరుడి చేత శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసేది. “జీవితంలో ఇది సాధారణం” అని బిడ్డకు చెప్పేది.
ఇదే అదనుగా భావించిన ఆ మహిళ బాయ్ఫ్రెండ్, అతని సహచరుడు.. బాలికపై కనీసం 8సార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం తన తండ్రికి చెబుతానని బాలిక అన్నప్పుడు.. చంపేస్తానని స్వయంగా తల్లి బెదిరించడం గమనార్హం.
అందుకే బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నెలల పాటు జరిగిన అత్యాచార సంఘటనల తర్వాత, చివరికి పూర్తి విషయాన్ని తన తండ్రికి ఇటీవలే చెప్పింది. ఆయన..పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహిళతో పాటు 30ఏళ్లు పైబడిన ఆ ఇద్దరు పురుషులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. గత బుధవారం హరిద్వార్లోని ఒక హోటల్లో మహిళ- ఆమె బాయ్ఫ్రెండ్ని అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని యూపీ మీరట్లో పట్టుకున్నారు. వీరిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
కాగా.. కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులకు పలు షాకింగ్ విషయాలు తెలిశాయి.
“బాలిక ఎనిమిది సార్లు రేప్నకు గురైంది. ఈ ఏడాది జనవరిలో కారులో తొలి ఘటన జరిగింది. ఆ తర్వాత నుంచి ఆగ్రా, బృందావన్ సహా అనేక ప్రాంతాల్లోని హోటల్స్లో బాలికపై అత్యాచారాలు జరిగాయి. ప్రతిసారి బాలికకు, ఆమె తల్లి మద్యం తాగించేది. ఆ తర్వాత, ఆమె బాయ్ఫ్రెండ్- అతని సహచరులు రేప్ చేసేవారు,” అని పోలీసులు వెల్లడించారు.
ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలికపై వైద్య పరీక్షలు నిర్వహించగా, అత్యాచారం జరిగినట్టు తేలిందని వివరించారు.
ఈ వ్యవహారం ఉత్తరాఖండ్లో కలకలం రేపింది. సదరు మహిళ పార్టీ సభ్యత్వాన్ని బీజేపీ తొలగించింది. అంతేకాదు, 2024 నుంచి ఆమె పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా లేదని తెలిపింది. ఆ సమయానికే పార్టీ బాధ్యతలను సరిగ్గా చూసుకోవడం లేదని ఆమెపై ఆరోపణలు ఉన్నట్టు పేర్కొంది.
ఈ పూర్తి వ్యవహారం రాజకీయ దుమారానికి దారితీసింది. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ‘బేటీ బచావో- బేటీ పడావో’ అనే బీజేపీ నినాదాలు విఫలం అయ్యాయని ఆరోపించింది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link