



Best Web Hosting Provider In India 2024
సోనియా గాంధీకి అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు లోనయ్యారు. దాంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అస్వస్థతకు గురికావడంతో హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ (ఐజీఎంసీ) ఆసుపత్రికి తరలించారు. ప్రైవేటు పర్యటన నిమిత్తం సిమ్లాలో ఉన్న సోనియా గాంధీ చారాబ్రాలోని ప్రియాంక గాంధీ నివాసంలో ఉంటున్నారు. జూన్ 7వ తేదీ ఆదివారం ఆమె తిరిగి ఢిల్లీకి తిరిగి రానున్నారు.
ఆసుపత్రిలో చికిత్స
శనివారం ఉదయం సమయంలో స్వల్ప అస్వస్థతకు గురైన సోనియాగాంధీని వెంటనే సిమ్లాలోని ఆస్పత్రికి తరలించారు. స్పెషలిస్ట్ డాక్టర్ల బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సోనియా గాంధీని చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చి పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు ఐజిఎంసిలోని ఒక సీనియర్ వైద్యుడు ధృవీకరించారు. ‘‘ఆమె రక్తపోటు కొద్దిగా ఎక్కువగా ఉంది. కానీ ఆమె స్థిరంగా ఉంది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. స్వల్ప అనారోగ్య సమస్యల కారణంగా సాధారణ చెకప్ కోసం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెను పరీక్షిస్తున్నారు’’ అని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు (మీడియా) నరేష్ చౌహాన్ తెలిపారు.
సీఎం పర్యటన రద్దు
సోనియా గాంధీ ఆరోగ్యంపై ఐజీఎంసీ యాజమాన్యం అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు హిమాచల్ ప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి ధని రామ్ షాండిల్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా ఆసుపత్రికి చేరుకున్నారు. రెండు రోజుల ఉనా పర్యటనలో ఉన్న హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు కూడా తన పర్యటనను రద్దు చేసుకుని సిమ్లాకు తిరిగి వచ్చారు. ప్రియాంక గాంధీ వాద్రాకు ఛారాబ్రాలో ఒక ప్రైవేట్ నివాసం ఉంది. ఇక్కడ గాంధీ కుటుంబం తరచుగా వేసవిలో సమయం గడపడానికి వస్తుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link