




Best Web Hosting Provider In India 2024

అట్లీ సినిమాలో దీపికా పదుకొణె.. సందీప్ రెడ్డి వంగాపై విమర్శలు.. ఫ్యాన్స్ ఫైర్.. ఏమైందంటే?
సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ నుంచి తప్పుకొన్న కొన్ని రోజులకే అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ సినిమాలో నటించడానికి దీపికా పదుకొణె అంగీకరించారు. ఈ నేపథ్యంలో సందీప్ పై తీవ్ర విమర్శలు రావడం హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఏఏ22xఏ6 పాన్ ఇండియా చిత్రంలో దీపికా పదుకొణె నటించనుందని శనివారం ఉదయం మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. కల్కి 2898 ఏడీ తర్వాత దీపికా నటిస్తున్న రెండో తెలుగు పాన్-ఇండియా సినిమా ఇది. అయితే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ చిత్రం నుంచి ఆమె వైదొలిగిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన రావడం గమనార్హం.
సందీప్ పై విమర్శలు
అట్లీ సినిమాలో దీపికా పదుకొణె నటిస్తుండటంతో మరో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అల్లు అర్జున్, అట్లీ సినిమా తెలుగులో తెరకెక్కుతోంది. అట్లీ, దీపికా ఉండటంతో తమిళం, హిందీ భాషల్లో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
ఎవరివి అబద్దాలు
దీపికా ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్న తర్వాత, తెలుగులో డైలాగులు చెప్పకూడదనే ఆమె డిమాండ్కు సందీప్ రెడ్డి వంగా అంగీకరించలేదని వార్తలు వచ్చాయి. శనివారం అల్లు అర్జున్ సినిమా ప్రకటన వెలువడిన తర్వాత, రెడ్డిట్ యూజర్లు ఈ ప్రకటనను తప్పుబడుతున్నారు. “తెలుగు మాట్లాడటం లేదా 8 గంటలు లేదా పారితోషికం గురించి కాదు. అన్నీ అబద్ధాలేనా? ఈ మొత్తం వ్యవహారంలో ఎవరు పెద్ద అబద్ధాలకోరో ఇప్పుడే తెలిసింది” అని ఓ నెటిజన్ సందీప్ పై ఫైర్ అయ్యారు.
అట్లీ అంగీకరించారు
దీపికా ఇప్పుడు తెలుగు సినిమా ఎందుకు చేస్తోందని ఒక రెడ్డిటర్ ప్రశ్నించగా, మరొక యూజర్ ఇలా వ్యాఖ్యానించారు.. “వంగా ఆమె డిమాండ్లకు అంగీకరించలేదు. కానీ, అట్లీ అంగీకరించారు. అదే తేడా” అని పేర్కొన్నాడు. అయితే మరికొందరు మాత్రం దీపికా తెలుగులో మాట్లాడకూడదని చెప్పిందనే వంగా వాదనలను తప్పుబడుతున్నారు. “వంగా అబద్ధం చెప్పాడని ఇది చూపడం లేదా” అని ఒకరు ప్రశ్నించారు. మరొకరు స్పందిస్తూ “దీపికా, ఎవరైనా సరే, తన సొంత నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ ఉంది. ఆమెను టాప్ మేకర్స్ సంప్రదిస్తున్నారనేది నిజం” అని తెలిపారు.
ఆ డిమాండ్లు చేసిందని
స్పిరిట్కు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ప్రభాస్ హీరో. దీపికా ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ చిత్రంలోకి వచ్చింది. కానీ మేలో ప్రాజెక్ట్ నుంచి నిష్క్రమించింది. 8 గంటల పనిదినాలు, తెలుగులో డైలాగులు చెప్పకూడదనే ఆమె డిమాండ్లను నిర్మాతలు ‘వృత్తిపరంగా లేనివి’గా భావించారని నివేదికలు పేర్కొన్నాయి. అంతే కాకుండా రూ.25 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందని, లాభాల్లో 10 శాతం వాటా కూడా అడిగిందనే వార్తలొచ్చాయి.
అయితే, ఆమె కొత్త తల్లి కావడంతో 8 గంటల షిఫ్ట్ డిమాండ్కు మద్దతు లభించింది. వంగా తర్వాత దీపికా తన సినిమా కథను లీక్ చేసిందని ఆరోపించారు. చివరికి ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది.
సంబంధిత కథనం