భారత్‌లో యాక్టివ్ కోవిడ్-19 కేసులు 6,133.. గత 24 గంటల్లో 6 మరణాలు!

Best Web Hosting Provider In India 2024


భారత్‌లో యాక్టివ్ కోవిడ్-19 కేసులు 6,133.. గత 24 గంటల్లో 6 మరణాలు!

Anand Sai HT Telugu

భారతదేశంలో కోవిడ్ 19 కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జూన్ 8 నాటికి 6,133 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఆరు మరణాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ధారించింది.

భారత్ కోవిడ్ కేసులు

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం.. భారతదేశంలో యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య ఆదివారం నాటికి 6,000 మార్కును దాటింది. గత రెండు రోజుల్లో 769 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతానికి భారతదేశంలో 6,133 యాక్టివ్ కోవిడ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఆరు మరణాలు సంభవించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళలో అత్యధిక సంఖ్యలో యాక్టివ్ కేసులు నమోదవుతున్నాయి. తరువాత గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ ఉన్నాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. కేరళలో 1950 యాక్టివ్ కేసులు ఉండగా, నిన్నటి నుండి రెండు మరణాలు నమోదయ్యాయి. గుజరాత్‌లో మొత్తం యాక్టివ్ కేసులు 822, బెంగాల్‌లో 693, ఢిల్లీలో 686 ఉన్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో వరుసగా 595, 366 కేసులు నమోదయ్యాయి. నిన్నటి నుండి కర్ణాటకలో రెండు మరణాలు సంభవించగా, తమిళనాడులో ఒకరు మరణించారు.

పెరుగుతున్న కోవిడ్ కేసుల దృష్ట్యా, కేంద్ర ఆరోగ్య అధికారులు సౌకర్యాల స్థాయి తనిఖీ చేయడానికి మాక్ డ్రిల్‌లను నిర్వహిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరాలు, ఐసోలేషన్ పడకలు, వెంటిలేటర్లు, అవసరమైన మందులను సరిగా చూసుకోవాలని అధికారులు ఆదేశించారు. చాలా వరకు ఇన్ఫెక్షన్లు తేలికపాటివిగా ఉండి ఇంట్లోనే చికిత్స పొందుతున్నాయన్నారు. అయితే మరింత తీవ్రతరం సంసిద్ధంగా ఉండాలని చెప్పారు.

ఈ ఏడాది జనవరి నుంచి భారతదేశంలో 65 మరణాలు సంభవించాయి. ముఖ్యంగా మే 22న యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 257గా ఉంది. తక్కువ వ్యవధిలో యాక్టివ్ కేసులు పెరిగాయి.

కేరళలో జరిగిన మూడు కోవిడ్ మరణాలలో SHT, CAD, CKD ఉన్న 51 ఏళ్ల పురుషుడు, T2 DM, CKD, మెటాస్టాసిస్‌తో అన్నవాహిక అడెనోకార్సినోమా ఉన్న 64 ఏళ్ల మహిళ, CAD-పోస్ట్ CABG, CKD మల్టిపుల్ మైలోమా, AKI ఉన్న 92 ఏళ్ల పురుషుడు ఉన్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తమిళనాడులో రోగి అనియంత్రిత డయాబెటిస్ మెల్లిటస్, తీవ్రమైన మూత్రపిండ వ్యాధి, మూర్ఛ రుగ్మతతో బాధపడుతున్న 42 ఏళ్ల పురుషుడు మరణించాడు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link