‘డిజిటల్ అరెస్ట్’ మోసంలో రూ.4.75 కోట్లు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు; నిందితులు ఇద్దరూ హైదరాబాదీలు

Best Web Hosting Provider In India 2024


‘డిజిటల్ అరెస్ట్’ మోసంలో రూ.4.75 కోట్లు పోగొట్టుకున్న వృద్ధ దంపతులు; నిందితులు ఇద్దరూ హైదరాబాదీలు

Sudarshan V HT Telugu

రూ.4.75 కోట్ల సైబర్ మోసం కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు.

డిజిటల్ అరెస్ట్ మోసంలో రూ.4.75 కోట్లు పోగొట్టుకున్న దంపతులు

రూ.4.75 కోట్ల సైబర్ మోసానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. చెన్నైలోని సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేటర్ల సమాచారంతో ఈ అరెస్టులు జరిగాయి. నిందితులకు శ్రీలంక, కంబోడియాల్లోని విస్తృత క్రిమినల్ సిండికేట్ తో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.

ఇద్దరు హైదరాబాద్ వాసులు

నిందితులను హైదరాబాద్ కు చెందిన ఈశ్వర్ సింగ్, రామ్ నారాయణ్ చౌదరిగా గుర్తించారు. శ్రీలంక, కాంబోడియాల్లోని క్యాసినోలతో విస్తృత సంబంధాలున్న ఈశ్వర్ సింగ్ ప్రొఫెషనల్ జూదగాడని, రామ్ నారాయణ్ చౌదరి నగరంలో డిపార్ట్ మెంటల్ స్టోర్ నిర్వహిస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. చెన్నై సైబర్ క్రైమ్ అధికారులు బెంగళూరుకు చెందిన మరో సైబర్ క్రైమ్ విచారణ సందర్భంగా ఈ డిజిటల్ అరెస్ట్ మోసం వెలుగులోకి వచ్చింది.

రిటైర్డ్ దంపతుల నుంచి రూ. 4.75 కోట్లు

చెన్నై బృందం బెంగళూరు పోలీసు విభాగాన్ని అప్రమత్తం చేయడంతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (డిసిపి) సారా ఫాతిమా ఈ కేసు దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో తేలిన వివరాల ప్రకారం.. బీటీఎం లేఅవుట్ కు చెందిన ఓ రిటైర్డ్ ఇంజినీర్, అతని భార్యను నెలల తరబడి ఈ సైబర్ నేరస్తులు రహస్యంగా టార్గెట్ చేశారు. అనంతరం ఒక రోజు వారికి ఫోన్ చేసి తాము కేంద్ర ప్రభుత్వ అధికారులమని, మీరు మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నారని, అధికారులకు సహకరించాలని సైబర్ నేరగాళ్లు ఆ దంపతులను బెదిరించారు. అనంతరం, వారి వద్ద నుంచి దఫదఫాలుగా పెద్ద మొత్తంలో డబ్బును పలు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. తాము చట్టపరమైన ఆదేశాలను పాటిస్తున్నామని ఆ దంపతులు భావించారు. చివరకు కొడుకుకు, కూతురికి కూడా చెప్పకుండా దాదాపు రూ. 4.75 కోట్లను వివిధ ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. అందుకోసం వారు తమ ఆస్తి పత్రాలను కూడా తాకట్టు పెట్టారు. వీరి కుమారుడు మల్లేశ్వరంలో, కుమార్తె హెబ్బాళ్ లో నివాసం ఉంటున్నారు.

ఇలా బయటపడింది..

ఆ దంపతుల నుంచి తీసుకున్న మొత్తంలో రూ.10 లక్షలు హైదరాబాద్ బ్యాంకు ఖాతాకు చేరడం, అది వేరే కేసు దర్యాప్తు సందర్భంగా వెలుగులోకి రావడంతో ఈ కేసు దర్యాప్తు ఊపందుకుంది. తన ఇంటి యజమాని ఈశ్వర్ సింగ్ తరఫున ఈ డబ్బు తనకు అందిందని ఆ డబ్బు పొందిన ఖాతాదారుడు పోలీసులకు తెలిపాడు. శ్రీలంకలోని ఓ క్యాసినోకు 33 ట్రిప్పులు వెళ్లిన ఈశ్వర్ సింగ్ ను హైదరాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ చేయగానే అరెస్టు చేశారు. కాసినో నుండి చట్టబద్ధమైన రీఫండ్ లో భాగంగా ఈ నిధులు వచ్చాయని సింగ్ పేర్కొన్నప్పటికీ, దర్యాప్తు అధికారులు అసాధారణ బ్యాంకింగ్ లావాదేవీలను కనుగొన్నారు. ఈ క్రమంలోనే బెంగళూరు దంపతులను మోసం చేసిన క్రమాన్ని గుర్తించారు. అనంతరం సింగ్ ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఈ స్కామ్ లో భాగస్వామిగా ఉన్న డిపార్ట్ మెంటల్ స్టోర్ యజమాని చౌదరిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link