





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: దీపపై కార్తీక్ మల్లెపూల వర్షం- జ్యోత్స్నను కాపాడిన శివ నారాయణ- శౌర్యతో పిలకల గొడవ!
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 14 ఎపిసోడ్లో కార్తీక్ను దీప బావ అని పిలుస్తుంది. దాంతో ఎమోషనల్ అయిన కార్తీక్ దీపపై మల్లెపూల వర్షం కురిపిస్తాడు. చిన్నప్పటిలాగే ఉండాలని మాట తీసుకుంటాడు. మరోవైపు దీప పేరు కేక్ మీద రాయించడంలో కార్తీక్ ప్రమేయం ఉందని శివ నారాయణ డౌట్ పడతాడు. నిజమా అని దశరథ్ అడుగుతాడు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో దీపను కార్తీక్ మరదలా అని పిలుస్తాడు. మీరు ఇలా పిలుస్తుంటే నాకు ఒకలా పిలవాలని ఉందని దీప అంటుంది. ఇలా పిలవాలని ఉందని మల్లెపూలతో బావ అని రాస్తుంది దీప. నేను నీ సొంత మేనత్త కొడుకుని, నీ బావని. నాకు పిలిపించుకోవాలని ఉన్నప్పుడు ఎందుకు ఆపడం. మనసారా వింటాను అని కార్తీక్ అంటాడు.
మనసుకు తగులుతుంది
దాంతో మెల్లిగా సిగ్గు పడుతూ బావ అని కార్తీక్ను దీప పిలుస్తుంది. మరోసారి పిలిపించుకుంటాడు. దాంతో కార్తీక్ ఎమోషనల్ అవుతాడు. జ్యోత్స ఎన్నోసార్లు పిలిచిన చెవికి మాత్రమే తగిలేది నువ్ పిలుస్తుంటే మనసుకు తగులుతుంది. ఇలాగే పిలు. వినడానికి చాలా బాగుంది అని కార్తీక్ అంటాడు. ఈ బావకు మాటిస్తావా మరదలా. కోనేటీలో కలిసినప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉందాం. మనం పేరుకే పెద్దలం కానీ చిన్నపిల్లల్లా ఉందాం అని కార్తీక్ అంటాడు.
నువ్ ఎలా అంటే అలా బావ అని దీప అంటుంది. నీ పిలుపుతో ప్రాణం పోశావ్ అని మల్లెపూలతో దీపై వర్షం కురిపిస్తాడు కార్తీక్. మరోవైపు దీప బాగా ఓవర్ చేస్తుందని, కార్తీక్ ఏమో మనం కేక్ పడేసింది బెదిరిస్తున్నాడని పారుతూ జ్యోత్స్న చెబుతుంది. వాడి కంట్లో ఎలా పడిందని భయపడుతుంది పారు. ఆ కార్తీక్ గాడు, దీప నిన్ను సర్కస్లో జంతువును చేసి ఆడిస్తున్నారని కోప్పడుతుంది పారు.
ఇప్పుడు నువ్ పిల్లబాతువి. వేషాలేయకుండా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానాలు సిద్ధం చేసి పెట్టుకో. దీపకు తిట్లు చివాట్లు కొత్తేం కాదు అని పారు అంటుంది. దీప ప్రవర్తన చూస్తుంటే తను ఈ ఇంటి వారసురాలు అని తెలిసిపోయిందేమో అనిపిస్తుంది. ముందు ఈ గ్రానీ కొడుకు ఎక్కడున్నాడో వెతికి వాన్ని చంపితే గానీ నాకు ఈ భయాలు పోవు అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
హంతకురాలిలా దీప
సుమిత్రను దశరథ్ నడిపించుకుంటూ తీసుకొస్తాడు. ఎక్కడికెళ్లారని జ్యో, పారు అడుగుతారు. హాస్పిటల్కు వెళ్లామని, టెస్ట్లు చేశారు. నిలబడి చేయాల్సిన పనులు పూర్తిగా తగ్గించాలని దశరథ్ చెబుతాడు. జ్యోత్స్న మాట్లాడుతుంటే నాకు మీద పీకల్లోతు కోపం ఉంది. ఎవరో దీప. దానికి నీకు ఒకే కేక్ మీద పేరు రాయించడం ఏంటీ. నీది మంచితనమో వెర్రితనమో అర్థం కావట్లేదు అని సుమిత్ర అంటుంది.
మీరు అంతా నాకు మనుషుల్లా కనిపిస్తారు. అది మాత్రం హంతకురాలిలా కనిపిస్తుంది. అలాంటిదాన్ని నువ్ ఎలా సపోర్ట్ చేస్తావ్ అని సుమిత్ర అంటుంది. ఇంతలో శివ నారాయణ వచ్చి జరిగింది చూస్తుంటే ఇందులో కార్తీక్ గాడి ప్రమేయం ఉందనిపిస్తుందని అంటాడు. ఈ ముసలోడు మాములుగాడు. దండేసి దండం పెట్టాలి అని పారు మనసులో అనుకుంటుంది.
నిజంగానే కేక్ మీద దీప పేరు రాయించడంలో కార్తీక్ గాడి ప్రమేయం ఉందా అని జ్యోను దశరథ్ అడుగుతాడు. ఇప్పుడేం చెప్పాలని భయపడిపోతారు జ్యోత్స్న, పారు. ఇవాళ దాని పుట్టినరోజురా ఏం అడక్కు అని చెప్పి జ్యోను శివ నారాయణ కాపాడుతాడు. తర్వాత సుమిత్రను గదిలోకి తీసుకెళ్తాడు దశరథ్. తర్వాత దీప మీద అమ్మకు ఉంది చిరాకు. నాకు కావాల్సింది అదే అని జ్యోత్స్న వెళ్లిపోతుంది.
ముగ్గురం వెళ్దాం
మరోవైపు శ్రీధర్ ఇంట్లో అల్లుడికి మర్యాదలు చేస్తుంది కావేరి. అది చూసి కోప్పడుతాడు శ్రీధర్. నాకు ఎవరు టిఫిన్ పెడతారు. నాకు ఎవరు లేరు. ఏక్ నిరంజన్. నేను పొమ్మంటున్న సిగ్గు లేకుండా నువ్వు నీ భర్త ఇంట్లో పడి తేరగా తింటున్నారుగా అని శ్రీధర్ అంటాడు. దాంతో కాశీ పైకి లే. ల్యాప్టాప్ తీసుకో. బట్టలు కూడా క్యాబ్లో పంపించు అని కూతురు అంటుంది.
ఇది పౌరుషం అంటే. దాన్ని చేయి కడుక్కుని వెళ్లమనే. లేకుంటే ఏదైనా హోటల్లో బిల్ కట్టకుండా పారిపోయిందనుకుంటారు అని శ్రీధర్ అంటాడు. ఈ మనిషితో మాటలు పడటం కంటే పోవడం బెటర్ అని కూతురు అంటుంది. పదండి ముగ్గురం కలిసి వెళ్దాం. వాళ్లు ఇంట్లో ఉంటే నేను ఉంటాను. లేకుంటే వాళ్లపోతో వెళ్తాను అని కావేరి అంటుంది.
కూతురు కోసం భర్తను వదిలేసిన దాన్ని నిన్నే చూస్తున్నాను. పెద్ద పెళ్లాన్నేమో కొడుకు మార్చాడు. చిన్న పెళ్లాన్నేమో అల్లుడు మార్చేశాడు అని శ్రీధర్ అంటాడు. మీరే ఉండండి నేనే వెళ్తాను అని శ్రీధర్ అంటాడు. అల్లుడు గారు మీరు తినండి అని కావేరి అంటే.. నీకు ఉత్తమ అత్త అనే అవార్డ్ ఇవ్వాల్సిందేనే. బాగా పెట్ట. నా బతుకు చెడ అని తిట్టుకుంటూ వెళ్లిపోతాడు శ్రీధర్.
పిలకల గొడవ
మరోవైపు శౌర్య జుట్టుు పిలకలు అంటుంది అనసూయ. శౌర్య గురించి కాంచనకు అనసూయ చెబుతుంది. దాంతో చాడీలు ఎందుకు చెబుతున్నావ్ అని అనసూయతో శౌర్య గొడవ పడుతుంది. అనసూయ అని పేరు పెట్టి పిలుస్తుంది. ఇంతలో కార్తీక్ వచ్చి ఏంటే రౌడీ చిన్నంతరం పెద్దంతరం లేదా అని అంటాడు. మేమేదో సరదాగా అనుకుంటున్నాం అని అనసూయ అంటుంది.
వరుసపెట్టి పిలిస్తే ఎంత బాగుంటుంది అని కార్తీక్ అని దీపను పిలుస్తాడు. వస్తున్నాను బావ అని దీప అంటుంది. దాంతో అంతా షాక్ అవుతారు. బావ అని పిలుస్తున్నావేంటే అని అనసూయ అడుగుతుంది. బావ అనేగా పిలిచింది. ఏమైంది అని కార్తీక్ అంటాడు. కొత్త పిలుపు ఏంటీ దీప అని కాంచన అడుగుతుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్