ఈనెల 20న విశాఖకు ప్రధాని మోదీ – షెడ్యూల్ ఇలా…!

Best Web Hosting Provider In India 2024

ఈనెల 20న విశాఖకు ప్రధాని మోదీ – షెడ్యూల్ ఇలా…!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

ప్రధాని మోదీ విశాఖకు రానున్నారు. జూన్ 21వ తేదీన జరిగే యోగా వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 20న విశాఖకు చేరుకుంటారు. ఆ రోజు విశాఖలోనే బస చేస్తారు. మరునాడు ఆర్కే బీచ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఢిల్లీకి తిరుగు పయనమవుతారు.

ప్రధాని మోదీ (ఫైల్ ఫొటో)

ప్రధానమంత్రి మోదీ విశాఖలో పర్యటించనున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా… జూన్ 21న యోగా కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఇందుకోసం జూన్ 20వ తేదీన విశాఖకు చేరుకోనున్నారు.

జూన్ 20వ తేదీన భువనేశ్వర్ నుంచి విశాఖ చేరుకోనున్న ప్రధాని మోదీ… ఆ రోజు రాత్రి తూర్పు నౌకాదళ అతిథిగృహంలో బస చేయనున్నారు. మరునాడు ఉదయం 6.30 నుంచి 7.45 వరకు విశాఖలోని ఆర్కే బీచ్ లో జరిగే యోగా డేలో పాల్గొననున్నారు. రాష్ట్ర సీఎం చంద్రబాబు కూడా ఈ ఈవెంట్ లో భాగమవుతారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

గిన్నిస్ రికార్డే లక్ష్యంగా …!

జూన్ 21 ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజును భారీ స్థాయిలో యోగా కార్యక్రమాలను చేపట్టనుంది. ఒక్క విశాఖలోనే ఒకే రోజు 5 లక్షల మంది యోగా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్కే బీచ్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు పాల్గొంటారు.

మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మంది లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ఉంది. 25 లక్షల మందికి యోగా సర్టిఫికెట్లు అందజేయాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. లక్ష కేంద్రాల్లో యోగా సాధన చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా యోగా అవగాహన కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆర్‌కె బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు జ‌రిగే యోగా ప్రదర్శనలో భారీ ఎత్తున ప్రజలు భాగస్వాములవుతారని అధికారులు భావిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగమయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. yogandhra.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

YogaAndhra Pradesh NewsChandrababu NaiduNarendra ModiVisakhapatnam
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024