బ్యాంకును దోచుకునే ఇద్దరు అమ్మాయిలు.. ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి

Best Web Hosting Provider In India 2024

బ్యాంకును దోచుకునే ఇద్దరు అమ్మాయిలు.. ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి

Hari Prasad S HT Telugu

ఓటీటీలోకి ఇప్పుడో మలయాళం థ్రిల్లర్ మూవీ రెండేళ్ల తర్వాత తెలుగులోకి వస్తోంది. 2023లో మలయాళంలో రిలీజైన ఈ సినిమాకు ఐఎండీబీలో 5.5 రేటింగ్ ఉంది. ఈ మూవీని ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీ స్ట్రీమింగ్ చేయనుంది.

బ్యాంకును దోచుకునే ఇద్దరు అమ్మాయిలు.. ఓటీటీలోకి రెండేళ్ల తర్వాత తెలుగులో వస్తున్న మలయాళం థ్రిల్లర్ మూవీ.. ఇక్కడ చూడండి

మలయాళం థ్రిల్లర్ సినిమాలకు మీరు అభిమానులా? అయితే మీకోసం తెలుగులో అలాంటిదే ఓ హైస్ట్ థ్రిల్లర్ మూవీ రాబోతోంది. ఈ సినిమా పేరు కొల్లా (Kolla). అంటే తెలుగులో దోపిడీ అని అర్థం. ఇప్పటికే ఈ మూవీ మలయాళం ఆడియోతో ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగులో రానుంది.

కొల్లా ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం మూవీ కొల్లా తెలుగులో ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (జూన్ 19) నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 17) ఆ ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేసింది.

“పర్ఫెక్ట్ క్రైమా? లేక పర్ఫెక్ట్ ట్రాపా? వాళ్లు అమాయకులుగా కనిపిస్తారు కానీ మాస్టర్‌మైండ్స్ లా ఆలోచిస్తారు. కొల్లా జూన్ 19 నుంచి తెలుగులో ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని తెలిపింది.

కొల్లా మూవీ గురించి..

కొల్లా అనే ఈ మలయాళం మూవీ 2023, జూన్ 9న థియేటర్లలో రిలీజైంది. ఇది ఆనీ (రజిషా విజయన్), శిల్పా (ప్రియా ప్రకాష్ వారియర్) అనే ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరిగే కథ. ఈ ఇద్దరూ ఓ బ్యాంకు దోపిడీ చేస్తారు. ఓ చిన్న ఊళ్లో బ్యూటీ పార్లర్ పెట్టి.. పక్కనే ఉన్న కోఆపరేటివ్ బ్యాంకు దోపిడీకి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్లే దోచేస్తారు.

వాళ్లు ఆ దోపిడీ ఎందుకు చేస్తారు? పోలీసులకు ఎలా చిక్కుతారు? వాళ్ల నుంచి తప్పించుకోవడానికి ఎలాంటి మాస్టర్ ప్లాన్ వేస్తారు? వాళ్ల భవిష్యత్తు ఏం కానుంది అన్నదే ఈ కొల్లా మూవీ స్టోరీ. ఈ సినిమాను సూరజ్ వర్మ డైెరెక్ట్ చేశాడు. దీనికి ఐఎండీబీలో 5.5 రేటింగ్ నమోదైంది.

కేవలం రెండు గంటల నిడివి ఉన్న ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. తర్వాత ప్రైమ్ వీడియోలో మలయాళం ఆడియోతో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ కానుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024