అత్యంత భయానకమైన ప్లేస్ అది.. మళ్లీ ఇక్కడికి రావద్దని అనుకున్నాను: రామోజీ ఫిల్మ్ సిటీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి

Best Web Hosting Provider In India 2024

అత్యంత భయానకమైన ప్లేస్ అది.. మళ్లీ ఇక్కడికి రావద్దని అనుకున్నాను: రామోజీ ఫిల్మ్ సిటీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి

Hari Prasad S HT Telugu

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీపై బాలీవుడ్ నటి కాజోల్ నోరు పారేసుకుంది. అది ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్లేస్ లలో ఒకటని ఆమె అనడం గమనార్హం. ఇక్కడికి తిరిగి రాకూడదని తాను అనుకున్నట్లు చెప్పింది.

అత్యంత భయానకమైన ప్లేస్ అది.. మళ్లీ ఇక్కడికి రావద్దని అనుకున్నాను: రామోజీ ఫిల్మ్ సిటీపై నోరు పారేసుకున్న బాలీవుడ్ నటి

రామోజీ ఫిల్మ్ సిటీ గురించి తెలుసు కదా. హైదరాబాద్ సమీపంలోని ఈ ప్రపంచ ప్రఖ్యాత ఫిల్మ్ సిటీ అందాలను చూసి ఆశ్చర్యపోని వారు ఎవరూ ఉండరు. కానీ అలాంటి ఫిల్మ్ సిటీని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్లేస్ గా బాలీవుడ్ నటి కాజోల్ అభివర్ణించడం గమనార్హం. అక్కడ షూటింగ్ చేసే సమయంలో తాను చాలా భయంభయంగా ఫీలైనట్లు ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

నిద్ర కూడా పట్టలేదు

కాజోల్ తన నెక్ట్స్ మూవీ మా (Maa) ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇదొక హారర్ మూవీ. ఇందులో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తనకు చాలా భయం వేసిన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చింది. అలాంటివి చాలా ప్రదేశాలు ఉన్నాయని, అందులో రామోజీ రావ్ స్టూడియోస్ అని చెప్పింది. “చాలాసార్లు అలా జరిగింది. చాలా ప్రదేశాలు ఉన్నాయి. అక్కడికి వెళ్లాం. షూటింగులు కూడా చేశాం.

రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఇక్కడి నుంచి బయటపడితే చాలు అనిపించింది. తిరిగి ఇక్కడికి రాకూడదు అని కూడా అనుకున్నాను. అలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిరావ్ స్టూడియోస్. దీనిని ప్రపంచంలోనే అత్యంత భయానకమైన ప్రదేశాల్లో ఒకటిగా చెబుతారు. ఒకటి రెండుసార్లు చాలా భయం వేసింది. కానీ భగవంతుని దయ వల్ల అలాంటివి ఏమీ చూడలేదు” అని కాజోల్ చెప్పింది.

కాజోల్ మా మూవీ గురించి..

కాజోల్, రోనిత్ రాయ్ లాంటి వాళ్లు నటించిన మా మూవీ జూన్ 27న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాను విశాల్ ఫూరియా డైరెక్ట్ చేశాడు. కాజోల్ భర్త అజయ్ దేవగన్ నిర్మాతల్లో ఒకడిగా ఉన్నాడు. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళం, బెంగాలీ భాషల్లోనూ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా అతీత శక్తుల నుంచి తన పిల్లలను కాపాడుకోవడానికి ఓ తల్లి ఎంత వరకూ వెళ్తుందన్న కథతో తెరకెక్కింది.

హారర్ జానర్లో కాజోల్ నటించిన తొలి సినిమా ఇదే. ఈ మూవీ షూటింగ్ లో కొంత భాగాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలోనూ చేశారు. ఈ సందర్భంగానే తనకు చాలా భయం వేసినట్లు కాజోల్ చెప్పింది. ఈ స్టూడియోపై తాను ఎందుకు అలాంటి కామెంట్స్ చేసింది? తనకు జరిగిన అనుభవం ఏంటన్నది మాత్రం ఆమె చెప్పలేదు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024