




Best Web Hosting Provider In India 2024

హైదరాబాద్లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ ప్రారంభం – దేశంలోనే తొలిసారి..!
హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ను ముఖ్య రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… హైదరాబాద్ లో ఈ కేంద్రం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు.గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అన్న ఆయన.. తమది కూడా ఇన్నోవేటివ్ ప్రభుత్వమని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ అందుబాటులోకి వచ్చింది. ఇది భారతదేశంలో మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి…. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ను ఇక్కడ ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
గూగుల్ ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం ఎంతో మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “నేడు, మన జీవితాలు పూర్తిగా డిజిటల్ మారాయి. మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నాము. మన ఆర్థిక వ్యవస్థ.. మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్ గా మారాయి. డిజిటల్ సురక్షితంగా ఉంటే… మనం మరింత అభివృద్ధి చెందుతాము. అధునాతన సైబర్ సెక్యూరిటీ , భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్ను ఉపయోగిస్తున్నందుకు నేను గర్విస్తున్నాను” అని ప్రసగించారు.
“చెడు చేయవద్దన్నది గూగుల్ సంస్థ సిద్ధాంతం. ఈ విధానాన్ని నేను ఇష్టపడుతున్నాను. గూగుల్ లాగా… మా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ అని వస్తుందని నాకు కచ్చితంగా తెలుసు. మీకు సెర్చ్ లో మొదటి లింక్ హైదరాబాద్ వస్తుంది. దీనిని మేము తెలంగాణ రైజింగ్ అని పిలుస్తాము. 2035 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నాము” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
“మేము 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నాము. గూగుల్ ఆఫీస్ పక్కనే రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళ ల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశాం. మా రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నాం. మా యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నాం. వీటన్నిటికీ మీ మద్దతు అవసరం. తెలంగాణ రైజింగ్కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నాను” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.
మాది ఇన్నోవెటివ్ ప్రభుత్వం – సీఎం రేవంత్
“2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. దాదాపు 7,000 మంది గూగుల్ ఉద్యోగులు నేడు హైదరాబాద్ను తమ ఇల్లుగా భావిస్తున్నారు. విద్య, భద్రత, మ్యాప్లు, ట్రాఫిక్, స్టార్టప్లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్ తో కలిసి మేం పనిచేస్తున్నాము. గూగుల్ ఒక వినూత్న(ఇన్నోవేటివ్) సంస్థ.. మాది ఒక వినూత్న ప్రభుత్వం. మా ప్రభుత్వం ఇటీవల హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్జెండర్లను నియమించాం. GHMC కూడా వివిధ పనుల కోసం ట్రాన్స్జెండర్లను నియమించుకుంటోంది” అని సీఎం రేవంత్ రెడ్డి ఉదహరించారు.
“నాణ్యమైన విద్య మా లక్ష్యం. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను తీసుకువస్తున్నాం. తెలంగాణ లో ప్రతి సంవత్సరం 1.10 లక్షల ఇంజనీర్స్ కాలేజ్ ల నుంచి వస్తున్నారు. చాలా మంది విద్యార్థులకు నైపుణ్యం ఉండడం లేదు. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. పబ్లిక్,ప్రైవేట్ భాగస్వామ్యం లో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు” అని సీఎం స్పష్టం చేశారు.
“మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దాం. హైదరాబాద్ లో మీ కొత్త సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏర్పాటు చేసినందుకు మరోసారి అభినందిస్తున్నాను. మేం గర్వపడేలా మీరు పనిచేస్తారని విశ్వసిస్తున్నాను” అని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.
టాపిక్