



Best Web Hosting Provider In India 2024
దేశంలో ఎన్ని మెడికల్ కాలేజీలు, ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి? రాష్ట్రాల వారీగా వివరాలు
దేశంలోని మొత్తం 780 వైద్య కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) 1,18,190 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. మొత్తం 12.36 లక్షల మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రాల వారీగా ఈ వివరాలు చూద్దాం..
నీట్ యూజీ 2025కు హాజరైన 22.09 లక్షల మంది విద్యార్థుల్లో 12.36 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. కానీ తాజా ఎన్ఎంసీ డేటా ప్రకారం దేశంలోని 780 వైద్య కళాశాలల్లో (ప్రభుత్వ, ప్రైవేటు) 1,18,190 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో ఎయిమ్స్, JIPMER వంటి ప్రఖ్యాత సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. అంటే దాదాపు 11.5 లక్షల మంది అర్హులైన విద్యార్థులకు ఎంబీబీఎస్ సీటు లభించదు.
కర్ణాటకలో అత్యధికంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. అత్యధికంగా మెడికల్ కాలేజీలు ఉత్తరప్రదేశ్లో ఉంటాయి. నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఇటీవల పంచుకున్న తాజా డేటాలో ఈ విషయం వెల్లడైంది. 2024-25 విద్యా సంవత్సరానికి మెడికల్ యూజీ, పీజీ మెడికల్ కోర్సుల(బ్రాడ్, సూపర్ స్పెషాలిటీ ప్రోగ్రామ్స్తో సహా) తాత్కాలిక సీట్ల సంఖ్యను ఎన్ఎంసీ విడుదల చేసింది.
రాష్ట్రాల వారీగా సీట్లు
దేశంలో వైద్య విద్య, వైద్య నిపుణులు, సంస్థలు, పరిశోధనలను పర్యవేక్షించే సంస్థ ఎన్ఎంసీ ప్రకారం దేశంలో అత్యధికంగా కర్ణాటకలో 12545 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా, యూపీలో 12475 సీట్లు ఉన్నాయి. తమిళనాడులో 12,050, మహారాష్ట్రలో 11,846 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
ఆ తర్వాత తెలంగాణలో 9040, గుజరాత్ లో 7250, ఆంధ్రప్రదేశ్ లో 6785, రాజస్థాన్ లో 6476, పశ్చిమ బెంగాల్ లో 5676, మధ్యప్రదేశ్ లో 5200, కేరళలో 4905 ఉండగా.. బీహార్ లో 2995, ఒడిశాలో 2725, ఛత్తీస్గఢ్లో 2255 సీట్లు ఉంటాయి. హర్యానాలో 2185, పంజాబ్ లో 1850, పుదుచ్చేరిలో 1830, అసోంలో 1650, ఢిల్లీలో 1497, ఉత్తరాఖండ్ లో 1400 సీట్లు ఉన్నాయి.
మెడికల్ కాలేజీలు
ఇక మెడికల్ కాలేజీల విషయానికొస్తే యూపీలో అత్యధికంగా 86 మెడికల్ కాలేజీలు ఉండగా.. ఆ తర్వాత మహారాష్ట్రలో 80, తమిళనాడులో 77, కర్ణాటకలో 73 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. తెలంగాణ (65), రాజస్థాన్ (43), గుజరాత్ (41), ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ (38). కేరళలో 34, మధ్యప్రదేశ్ లో 31 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. బీహార్ లో 22, ఒడిశాలో 19, ఛత్తీస్గఢ్లో 16, హర్యానాలో 13, అసోంలో 14, పంజాబ్లో 13, జమ్మూకశ్మీర్లో 2, ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో 10 చొప్పున, జార్ఖండ్, పుదుచ్చేరిల్లో 9 మెడికల్ కాలేజీలు.
హిమాచల్ ప్రదేశ్లో 8, మణిపూర్ లో 4, త్రిపురలో 3, మేఘాలయలో 2 మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ కోర్సును అందిస్తున్నాయి. సిక్కిం, నాగాలాండ్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు, గోవా, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒక్కో మెడికల్ కాలేజీ మాత్రమే ఉంది.
Best Web Hosting Provider In India 2024
Source link