




Best Web Hosting Provider In India 2024

ఇదో మాస్టర్పీస్.. ఏమాత్రం ఆలోచించకుండా చూసేయండి: కుబేర మూవీపై నాగ్ అశ్విన్ పోస్ట్ వైరల్
కుబేర మూవీని రెండు ముక్కల్లో చెప్పేశాడు కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇదో మాస్టర్ పీస్ అని అతడు స్పష్టం చేశాడు. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం (జూన్ 20) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
నాగార్జున, ధనుష్, రష్మిక మందన్నాలాంటి క్రేజీ కాంబినేషన్ తో శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా కుబేర. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జూన్ 20) పాన్ ఇండియా స్థాయిలో మూవీ రిలీజైంది. ఈ సినిమాకు అన్ని వర్గాల నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఈ మూవీని ఓ మాస్టర్ పీస్ అని అనడం విశేషం.
నాగ్ అశ్విన్ కుబేర రివ్యూ
కుబేర మూవీపై నాగ్ అశ్విన్ శుక్రవారం (జూన్ 20) ఉదయమే రివ్యూ ఇచ్చాడు. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో స్టోరీ పోస్ట్ చేశాడు. ఈ సందర్భంగా అతడు ఈ సినిమాను ఓ మాస్టర్ పీస్గా అభివర్ణించాడు. ఏమాత్రం ఆలోచించకుండా మూవీకి వెళ్లాలని ప్రేక్షకులకు సూచించాడు.
“మాస్టర్ ఫ… పీస్. ఆలోచించకండి. వెళ్లండంతే” అనే క్యాప్షన్ తో థియేటర్లలో మూవీని ప్రదర్శిస్తున్న ఫొటోను షేర్ చేశాడు. అతని పోస్ట్ వెంటనే వైరల్ గా మారిపోయింది. గతేడాది కల్కి 2898 ఏడీలాంటి బ్లాక్బస్టర్ అందించిన నాగ్ అశ్విన్.. కుబేరకు రెండు ముక్కల్లో ఇలాంటి రివ్యూ ఇవ్వడం ఆ సినిమాకు మరింత కలిసి రానుంది.
కుబేర మూవీ గురించి..
కుబేర మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. టాలీవుడ్ లోకి దర్శకుడిగా అడుగుపెట్టి 25 ఏళ్లయిన సందర్భంగా రిలీజైన ఈ సినిమా అతని కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోనుంది. కుబేరను ఓ క్రైమ్ థ్రిల్లర్ గా అతడు తెరకెక్కించాడు. ఇది ఒక లక్ష కోట్ల స్కామ్ కథ. ఈ స్కామ్లో ఒక బిలినియర్, ఓ బెగ్గర్, ఒక సీబీఐ ఆఫీసర్ ఎలా వచ్చారన్న ఎంగేజింగ్ సీన్లతో సాగే సినిమానే కుబేర.
ఇక నటీనటుల నటనకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. ముఖ్యంగా ధనుష్ అదరగొట్టినట్లు చెబుతున్నారు. అటు నాగార్జున కూడా ఇంత వరకూ చూడని పాత్రలో కనిపించాడు. ఓవరాల్గా శేఖర్ కమ్ముల మరోసారి తన మార్క్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ కు సోషల్ మెసేజ్ జోడించిన వచ్చిన ఈ కుబేర మూవీ ఓ మస్ట్ వాచ్ అని చెప్పొచ్చు.
సంబంధిత కథనం