కోడలిని చంపి, ఇంటిముందే వీధిలో పూడ్చిపెట్టిన అత్తామామలు; 2 నెలల తరువాత నేరం వెలుగులోకి..

Best Web Hosting Provider In India 2024


కోడలిని చంపి, ఇంటిముందే వీధిలో పూడ్చిపెట్టిన అత్తామామలు; 2 నెలల తరువాత నేరం వెలుగులోకి..

Sudarshan V HT Telugu

సొంత కోడలిని చంపి, ఇంటిముందే పూడ్చిపెట్టిన దారుణ నేరం రెండు నెలల తరువాత వెలుగు చూసింది. కోడలిని పూడ్చిపెట్టిన తరువాతఆమె కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మృతదేహాన్ని ఇంటిముందే వీధిలో పూడ్చిపెట్టిన గొయ్యి

ఫరీదాబాద్ లో ఓ మహిళను ఆమె అత్తమామలు హత్య చేసి తమ ఇంటి ముందు వీధిలోనే పాతిపెట్టారు. ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ జిల్లా షికోహాబాద్ కు చెందిన తనూ కుమార్ అనే మహిళకు ఫరీదాబాద్ లోని రోషన్ నగర్ ప్రాంతానికి చెందిన అరుణ్ సింగ్ తో రెండేళ్ల క్రితం వివాహమైంది. కోడలిని హత్య చేసి, మృతదేహాన్ని పూడ్చిపెట్టిన తరువాత, వారు ఆమె కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరకు దాదాపు రెండు నెలల తరువాత వారు చేసిన నేరం బయటపడింది.

ఇంటి ముందు వీధిలో గొయ్యి తవ్వి..

ఏప్రిల్ 23న తనూ భర్త అరుణ్ సింగ్, అతని తండ్రి భూప్ సింగ్ కలిసి ఒక జేసీబీని పిలిపించి తమ ఇంటి ముందున్న వీధిలో 10 అడుగుల లోతు గొయ్యి తవ్వారు. ఆ గొయ్యి డ్రైనేజీ కోసమని ఇరుగుపొరుగు వారికిి చెప్పారు. మరుసటి రోజు, వారు ఆ గొయ్యిని ఒక తాపీ మేస్త్రీని పిలిపించి పూడిపించారు. ఆ తరువాత వారు పోలీసులను ఆశ్రయించి తమ కోడలు తనూ కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. ఆమె మానసిక పరిస్థితి సరిగా లేదని వారు పోలీసులకు చెప్పారు.

తండ్రి అనుమానంతో..

అయితే, తనూ తండ్రి హకీమ్ వారి వాదనను అంగీకరించలేదు. తమ కూతురిని ఆమె అత్తామామలు, భర్తనే హత్య చేసి ఉంటారని అనుమానించాడు. అదే విషయాన్ని పోలీసులకు చెప్పాడు. కాని మొదట్లో వారు పట్టించుకోలేదు. తాను తన అల్లుడు అరుణ్ సింగ్ ఇంటికి వెళ్లినప్పుడు వారి ఇంటి ముందు చూసిన గుంత గురించి కూడా ఆయన పోలీసులకు తెలిపాడు. అయినా పోలీసులు తమ ఫిర్యాదును వినలేదని తనూ తండ్రి హకీమ్ ఆరోపించారు.

కట్నం కోసం అత్తమామల వేధింపులు

తన కుమార్తెను కట్నం కోసం అత్తమామలు వేధించారని, పెళ్లయిన తర్వాత ఏడాది పాటు ఆమె పుట్టింటిలోనే ఉండాల్సి వచ్చిందని హకీమ్ తెలిపాడు. పంచాయితీ జోక్యంతో ఆమె ఇటీవల ఫరీదాబాద్ లోని తన అత్తగారింటికి కు తిరిగి వచ్చింది. తనూ కనిపించడం లేదని హకీంకు సమాచారం అందడంతో వెంటనే భూప్ సింగ్ వారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి ఇంటి బయట పెద్ద గుంతను పూడ్చి ఉండడం కనిపించింది. దాంతో, అతడికి అనుమానం వచ్చింది.

రెండు నెలల తరువాత..

తనూ తండ్రి హకీం పదే పదే కోరడంతో పాటు తనూ ఆచూకీ తెలియకపోవడంతో రెండు నెలల తరువాత నాయబ్ తహసీల్దార్ జస్వంత్ సింగ్ సమక్షంలో ఆ గొయ్యిని తవ్వారు. అందులో 10 అడుగుల లోతులో తనూ మృతదేహం లభ్యమైంది. ‘‘తమ కోడలిని హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని చీకటి ముసుగులో వారు అక్కడే పూడ్చిపెట్టారు. ఏం జరిగిందో ఇరుగుపొరుగు వారెవరికీ తెలియదు’ అని పల్లా పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఇన్స్పెక్టర్ సత్య ప్రకాశ్ తెలిపారు. బాద్ షా ఖాన్ సివిల్ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం పోలీసులు తనూ మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

కేసు నమోదు

యూపీలోని మెయిన్ పురికి చెందిన భూప్ సింగ్, అతని భార్య సోనియా, కుమారుడు అరుణ్ సింగ్, కుమార్తె కాజల్ పై పల్లా పోలీస్ స్టేషన్ లో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. భూప్ సింగ్, అరుణ్ సింగ్ లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మిగతా కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఫరీదాబాద్ పోలీసు అధికార ప్రతినిధి తెలిపారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link