‘ఇన్​స్టాగ్రీమ్​ రీల్స్​ చూస్తూనే ఉంది’ అంటూ.. భార్యను కొడవలితో నరికి చంపిన భర్త!

Best Web Hosting Provider In India 2024


‘ఇన్​స్టాగ్రీమ్​ రీల్స్​ చూస్తూనే ఉంది’ అంటూ.. భార్యను కొడవలితో నరికి చంపిన భర్త!

Sharath Chitturi HT Telugu

కర్ణాటకలో ఓ మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఆమెకున్న ఇన్​స్టాగ్రామ్​ రీల్స్​ వ్యసనం వల్లే మహిళ భర్త ఈ దారుణానికి ఒడిగట్టాడు!

భార్యను కొడవలితో నరికి చంపిన భర్త! (Pexels)

కర్ణాటకలోని ఉడుపి జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్న విషయంలో గొడవ పడిన తర్వాత 27 ఏళ్ల మహిళను ఆమె భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన డిజిటల్ వ్యసనం, కుటుంబ కలహాల చీకటి కోణాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.

అసలేం జరిగింది..?

శంకరనారాయణ పోలీస్ స్టేషన్​ పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. నివేదిక ప్రకారం.. నిందితుడు 42 ఏళ్ల గణేష్ పూజారి, పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. బ్రహ్మవర తాలూకాలోని హోసమఠ, హిలియానా గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతని భార్య రేఖ శంకరనారాయణలోని ఒక పెట్రోల్ బంకులో అటెండెంట్‌గా పనిచేస్తోంది. రేఖ తన మొబైల్ ఫోన్‌లో రీల్స్ చూడటంపై ఈ దంపతులు తరచుగా గొడవపడేవారు. ఈ విషయం ఇంతకుముందు పోలీసుల జోక్యానికి కూడా దారితీసిందిఒ! వారి కుటుంబ వివాదాలపై హెచ్చరిక అందిన తర్వాత అధికారులు గతంలో ఈ దంపతుల నుంచి ఒక అండర్‌టేకింగ్ కూడా తీసుకున్నారు.

కాగా హత్య జరిగిన రాత్రి.. పూజారి ఆలస్యంగా ఇంటికి వచ్చి, రేఖ మళ్లీ రీల్స్ చూస్తూ కనిపించడంతో సహనం కోల్పోయాడు. బాగా కొప్పడ్డాడు. వాదన త్వరగా తీవ్రమైంది. కోపంతో అతను ఆమెను కొడవలితో దాడి చేసి, మెడపై తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బలకు ఆమె మరణించింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పోలీసులు పూజారిని అరెస్టు చేసి, అతనిపై హత్య కేసు నమోదు చేశారు.

రీల్స్ వ్యసనం వల్ల ఆత్మహత్య!

చామరాజనగర్ జిల్లాలోని పిజి పాలియా నుండి ఇంతకు ముందు నివేదించబడిన ఇలాంటి సంఘటనలో, 33 ఏళ్ల కుమార్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్య ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌తో అతిగా నిమగ్నం కావడం వల్ల అతను తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడని ఆరోపణ.

కుమార్ భార్య ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోల గురించి స్నేహితుల నుండి తరచుగా వచ్చే ఎగతాళి వ్యాఖ్యల కారణంగా అతను భావోద్వేగ సమస్యలను ఎదుర్కొంటున్నాడని కుమార్ కుటుంబం పేర్కొంది. అతను తన అసౌకర్యాన్ని మరియు అభ్యంతరాలను వ్యక్తం చేసినప్పటికీ, అతని భార్య రీల్స్ చేయడం మరియు పోస్ట్ చేయడం కొనసాగించిందని, ఇది దంపతుల మధ్య తరచుగా గొడవలకు దారితీసిందని నివేదించబడింది.

ఉద్రిక్తత తారాస్థాయికి చేరడంతో, కుమార్ తీవ్ర నిర్ణయం తీసుకుని చెట్టుకు ఉరివేసుకుని కనిపించాడు. ఆత్మహత్య లేఖ ఏదీ లభించలేదని పోలీసులు తెలిపారు, అయితే ప్రాథమిక విచారణలో సామాజిక మాధ్యమాలు కుటుంబ వివాదానికి దోహదపడిన అంశంగా గుర్తించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link