పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో బిగ్​ అప్డేట్​- ఆ ఇద్దరు అరెస్ట్​..!

Best Web Hosting Provider In India 2024


పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో బిగ్​ అప్డేట్​- ఆ ఇద్దరు అరెస్ట్​..!

Sharath Chitturi HT Telugu

పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో ఎన్​ఐఏ తాజాగా ఇద్దరిని అరెస్ట్​ చేసింది. ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్​లకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించినట్టు సమాచారం!

పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో బిగ్​ అప్డేట్​!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో బిగ్​ అప్డేట్​! ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్​ఐఏ (జాతీయ దర్యాప్తు బృందం).. తాజాగా ఇద్దరిని అరెస్ట్​ చేసింది. పహల్గామ్​ దాడికి పాల్పడిన ఉగ్రవాదులకు ఈ ఇద్దరు ఆశ్రయం కల్పించారు.

ఎన్​ఐఏ అరెస్ట్​ చేసిన ఆ ఇద్దరు ఎవరు?

జమ్ముకశ్మీర్​లోని పహల్గామ్​లో ఏప్రిల్​ 22న ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. కొందరు ఉగ్రవాదులు టూరిస్ట్​లు ఉన్న చోటకు చొరబడి కాల్పులకు తెగించారు. పురుషులను.. వారి మతం అడిగి మరీ కాల్చిచంపారు. మహిళలను విడిచిపెట్టి “వెళ్లి మోదీకి చెప్పు” అని అన్నారు. ఈ ఉగ్రదాడిలో 26మంది అమాయక భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.

పహల్గామ్​ ఉగ్రదాడికి ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్​, పాక్​ ఆక్రమిత కశ్మీర్​లోని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్​ చేసి, ధ్వంసం చేసింది. తదనంతర పరిణామాలతో ఇరు దేశాలు యుద్ధం అంచువరకు వెళ్లాయి. చివరికి, కాల్పుల విరమణ ఒప్పందంతో పరిస్థితులు శాంతించాయి.

కాగా.. ఏప్రిల్​ 22న జరిగిన పహల్గామ్​ ఉగ్రదాడి కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తాజాగా బిగ్​ అప్డేట్​ వచ్చింది. పహల్గామ్​లోని బాట్​కోటె, హిల్​ పార్క్​లో నివాసముండే పర్వీజ్​ అహ్మద్​ జాథోర్​, బషీర్​ అహ్మద్​ జాథోర్​లను ఎన్​ఐఏ తాజాగా అరెస్ట్​ చేసింది. వీరిని విచారించగా.. ఉగ్రదాడికి పాల్పడిన టెర్రరిస్ట్​లలో ముగ్గురు పాకిస్థానీలు ఉన్నారని చెప్పినట్టు సమాచారం. అంతేకాదు, ఆ ముగ్గురు కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందినవారని వెల్లడించినట్టు తెలుస్తోంది.

వచ్చిన వారు ఉగ్రదాడికి పాల్పడుతున్నారని తెలిసి కూడా పర్వీజ్​, బషీర్​లు వారికి ఆశ్రయం ఇచ్చారు. హిల్​ పార్క్​లోని ఒక స్థావరంలో వారికి ఆహారం, షెల్టర్​, లాజిస్టిక్స్​ని అందించారు. అక్కడి నుంచే ఉగ్రవాదులు పహల్గామ్​కు వెళ్లి మారణకాండకు పాల్పడ్డారు.

యూఏపీఏ చట్టంలోని సెక్షన్​ 19 (ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం) కింద ఇద్దరు నిందితులను అరెస్ట్​ చేసినట్టు ఎన్​ఐఏ తెలిపింది. కేసులో దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించింది.

షోపియాన్​, కుల్గామ్​, పుల్వామా, సోపోర్​, కుప్వారా సహా 32 లొకేషన్స్​లో వారాల పాటు ఎన్​ఐఏ దాడులు నిర్వహించిన అనంతరం ఈ అరెస్ట్​లు చేసింది. ఉగ్రవాద సంస్థలకు సాయం చేస్తున్న అండర్​గ్రౌండ్​ వర్కర్లను పట్టుకునేందుకు ఈ దాడులు జరిగాయి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link