హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్

Best Web Hosting Provider In India 2024

హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్

Sanjiv Kumar HT Telugu

రచయిత, దర్శకుడు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా తెలుగు హారర్ థ్రిల్లర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇటీవల జరిగిన లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..!

హారర్ మూవీ లోపలికి రా చెప్తా ట్రైలర్ రిలీజ్.. భయపెట్టే విషయాలు బయట కూడా చాలా జరుగుతున్నాయన్న రైటర్ విజయేంద్ర ప్రసాద్

రోజురోజుకు తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్ తెచ్చుకుంటూ ముందుకు రానున్న సినిమా “లోపలికి రా చెప్తా”. మాస్ బంక్ మూవీస్ పతాకంపై వెంకట రాజేంద్ర నిర్మించిన తెలుగు హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లోపలికి రా చెప్తా’. ఈ సినిమాలో కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా నటించారు.

హీరోగా నటించడమే కాకుండా

అలాగే, లక్ష్మీ గణేష్, కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలు, పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ‘లోపలికి రా చెప్తా’ చిత్రం జూలై 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది.

లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్

శనివారం (జూన్ 21) హైదరాబాద్‌లో లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ప్రముఖ రచయిత, డైరెక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా లోపలికి రా చెప్తా ట్రైలర్ లాంచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బయట కూడా చాలా జరుగుతున్నాయి

రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “లోపలికి రా చెప్తా సినిమా ట్రైలర్ లాంఛ్‌కు అతిథిగా రావడం సంతోషంగా ఉంది. ట్రైలర్ చూశాక మీలో భయం కలిగే ఉంటుంది. అయితే మనల్ని భయపెట్టే విషయాలు ఈ సినిమాలో లాగే బయట కూడా చాలా జరుగుతున్నాయి” అని అన్నారు.

మంచి కలెక్షన్స్ కూడా

“లోపలికి రా చెప్తా సినిమా ప్రేక్షకుల్ని భయపెట్టడమే కాదు, వారి దగ్గర నుంచి మంచి కలెక్షన్స్ కూడా రాబట్టాలని నా బెస్ట్ విషెస్ ఈ సినిమా టీమ్‌కు అందిస్తున్నా” అని రైటర్, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

నాటకరంగం నుంచి వచ్చా

ఇదే ఈవెంట్‌లో నటుడు రమేష్ మాట్లాడుతూ.. “నేను నాటకరంగం నుంచి వచ్చాను. ఈ చిత్రంతో మళ్లీ తెరపై కనిపించడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా రాజేంద్ర గారికి థ్యాంక్స్. క్యాచీ టైటిల్‌తో మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మిమ్మల్ని భయపెడుతూనే ఎంటర్‌టైన్ చేస్తుంది” అని చెప్పుకొచ్చారు.

మంచి మూవీ అవుతుందని

“ప్రేక్షకుల్ని లోపలికి రా చెప్తా అని పిలిచే ఫీల్‌తో మా డైరెక్టర్ మంచి టైటిల్ సినిమాకు పెట్టారు. ఈ చిత్రంలో ఓ మంచి రోల్ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉంది. స్క్రిప్ట్ గురించి తెసినప్పుడే ఇది మంచి మూవీ అవుతుంది అనే నమ్మకం కలిగింది” అని యాక్టర్ ప్రవీణ్ కటారి తెలిపారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024