ఇరాన్‌లో ఎంబీబీఎస్ చేయడానికి భారతీయులు ఎందుకు ఆసక్తి చూపిస్తారు?

Best Web Hosting Provider In India 2024


ఇరాన్‌లో ఎంబీబీఎస్ చేయడానికి భారతీయులు ఎందుకు ఆసక్తి చూపిస్తారు?

Anand Sai HT Telugu

ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు అందరినీ కలవరపెడుతున్నాయి. ఇందులోకి అమెరికా కూడా వెళ్లడంతో పరిస్థితి దారుణగా తయారైంది. కానీ సాధారణంగా ఇరాన్‌లో ఎంబీబీఎస్ చదవడానికి భారతీయులు ఆసక్తి చూపిస్తారు. ఎందుకు?

ప్రతీకాత్మక చిత్రం

రాన్‌పై అమెరికా దాడి తర్వాత ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం గురించి భయాందోళనలు మెుదలయ్యాయి. అయితే అమెరికా దాడికి ముందే భారత ప్రభుత్వం అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్థులు, పౌరులను తిరిగి తీసుకురావడానికి ఆపరేషన్ సింధును ప్రారంభించింది. ఇరాన్ నుండి వచ్చే భారతీయ విద్యార్థులలో ఎక్కువ మంది అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 1500 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో చదువుతున్నారు. ఇరాన్‌లో చదువుతున్న వారిలో 70 నుండి 80 శాతం మంది మెడిసిన్ చదివేందుకే వెళ్లారు.

అక్కడ డిమాండ్ ఎందుకు?

భారతదేశంలో వైద్య ప్రవేశ పరీక్ష NEET UG చాలా కఠినమైనది. ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్ష రాస్తున్నారు. కానీ భారతదేశంలో 1.18 లక్షల ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రైవేట్ కళాశాలల్లో వైద్య విద్య కూడా చాలా ఖరీదైనది. ప్రభుత్వ కళాశాలల్లో 55 వేల సీట్లే ఉంటాయి. దీంతో భారతీయ విద్యార్థులు వైద్య విద్య కోసం ఇరాన్, హంగేరీ, ఉక్రెయిన్, చైనా, కజకిస్థాన్ వంటి దేశాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఉక్రెయిన్, ఇరాన్ వంటి దేశాలలో ఎంబీబీఎస్ ఆరు సంవత్సరాలు. ఇందులో ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ కూడా ఉంటుంది.

ఇరాన్‌కు విద్యార్థులు

ఇరాన్ విషయానికొస్తే 2019లో 737 మంది భారతీయ విద్యార్థులు, 2020లో 186 మంది, 2021లో 600 మంది, 2022లో 1063 మంది, 2023లో 1325 మంది వెళ్లారు. 2019 నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లే భారతీయ విద్యార్థుల సంఖ్యను పరిశీలిస్తే అది 1268, 460, 639, 1061, 1288. ప్రస్తుతం దాదాపు 1500 మంది భారతీయ విద్యార్థులు ఇరాన్‌లో చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది వైద్య విద్యలో ఉన్నారు.

ఇరాన్ నుండి తిరిగి వచ్చిన విద్యార్థులు ఆకాశం నుండి క్షిపణులు పడుతున్నాయని, పరిసరాల్లో బాంబు దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ సంవత్సరం టెహ్రాన్‌లోని ఇరాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ చదువు కోసం అడ్మిషన్ తీసుకున్న ఒక విద్యార్థి తాను మూడు నెలల క్రితమే భారతదేశం నుండి ఇరాన్‌కు వెళ్లానని, కానీ ఇప్పుడు తిరిగి రావాల్సి వచ్చిందన్నారు.

తక్కువ ఫీజు

ఇరాన్‌లో ఆరు సంవత్సరాల ఎంబీబీఎస్‌కి మొత్తం ఫీజులు 15 నుండి 20 లక్షల రూపాయల మధ్య అవుతుంది. ఇందులో ఏడాది ఇంటర్న్ షిప్. భారతదేశంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో ఎంబీబీఎస్ ఖర్చు 50 లక్షల నుండి 1 కోటి రూపాయల మధ్య ఉంటుంది. ఇక కొన్ని కాలేజీల్లో అంతకంటే ఎక్కువే. వైద్య విద్యకు అయ్యే ఖర్చు ఇక్కడ భారతీయులను ఆకర్షిస్తుంది.

ఇరాన్ సురక్షితం

మరోవైపు భారతీయ విద్యార్థులపై హింసాత్మక దాడుల చూసుకుంటే.. ఇరాన్ సురక్షితంగా ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2020 నుండి 2024 వరకు ఆస్ట్రేలియా, అమెరికా, యూకే, ఇటలీ, రష్యా, కెనడా, ఐర్లాండ్, ఇరాన్, జర్మనీ, ఫిలిప్పీన్స్‌లలో భారతీయ విద్యార్థులపై మొత్తం 77 దాడులు జరిగాయి. ఇరాన్‌లో 1 కేసు మాత్రమే నమోదైంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link