




Best Web Hosting Provider In India 2024
అంపైర్ తో గొడవ.. బంతిని నేలకేసి కొట్టి.. పనిష్మెంట్తో పంత్ కు షాకిచ్చిన ఐసీసీ
ఇంగ్లాండ్ తో తొలి టెస్టు లో వరుసగా రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు బాదిన రిషబ్ పంత్ కు షాక్ తప్పలేదు. బంతి ఛేంజ్ విషయంలో అంపైర్ తో గొడవకు దిగిన అతనిపై ఐసీసీ కొరడా ఝుళిపించింది.
బ్యాటింగ్ లో అదరగొట్టి.. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలతో హిస్టరీ క్రియేట్ చేసిన రిషబ్ పంత్ కు ఐసీసీ షాకిచ్చింది. హెడింగ్లీ టెస్టు మూడో రోజు ఆటలో అంపైర్ తో గొడవ వల్ల పంత్ కు శిక్ష విధించింది ఐసీసీ. ఈ విషయాన్ని మంగళవారం (జూన్ 24) ఐసీసీ వెల్లడించింది.
ఏం జరిగిందంటే?
ఇంగ్లాండ్, ఇండియా ఫస్ట్ టెస్టు లీడ్స్ లోని హెడింగ్లీలో జరుగుతోంది. ఆదివారం (జూన్ 22) మ్యాచ్ లో మూడో రోజు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తుంది. క్రీజులో హ్యారీ బ్రూక్ ఉన్నాడు. సిరాజ్ బౌలింగ్ వేస్తున్నాడు. ఇన్నింగ్స్ 61వ ఓవర్ అయిదో బంతికి బ్రూక్ బౌండరీ కొట్టాడు. అయితే బంతి ఆకారంపై భారత వైస్ కెప్టెన్ పంత్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తనిఖీ కోసం అంపైర్ వద్దకు వెళ్లాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ పాల్ రీఫెల్ దానిని బాల్ గేజ్ తో పరిశీలించాడు.
అంపైర్ నిర్ణయంతో
బాల్ షేప్ తో అంపైర్ సంతృప్తి చెందాడు. బాల్ ను ఛేంజ్ చేయాల్సిన అవసరం లేదన్నాడు. అంపైర్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పంత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బంతిని మార్చాలని అంపైర్ తో గొడవకు దిగాడు. బంతిని నేలకేసి కొట్టాడు. అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ సమయంలో ఇంగ్లిష్ ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున కేకలు వినిపించాయి.
లెవల్ 1
అంపైర్ తో వాగ్వాదం, బంతిని నేలకేసి కొట్టడంతో టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ కు ఐసీసీ ఫైన్ విధించింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ను ఉల్లంఘించినందుకు అతను అధికారిక మందలింపుకు గురయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్ సందర్భంగా అంపైర్ నిర్ణయంపై అసమ్మతి వ్యక్తం చేసినందుకు సంబంధించిన ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.8ను భారత వైస్ కెప్టెన్ ఉల్లంఘించినట్లు తేలింది. అతనికి ఒక డీమెరిట్ పాయింట్ విధించారు. గత 24 నెలల్లో అతను చేసిన తొలి తప్పు ఇదే కాబట్టి ఓ డీమెరిట్ పాయింట్ ఇచ్చారు.
ఒప్పుకొన్న పంత్
ఐసీసీ విధించిన శిక్షపై ఎలాంటి అప్పీల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తాను చేసిన తప్పును పంత్ ఒప్పుకొన్నాడని ఐసీసీ తెలిపింది. అతను ఓ డీమెరిట్ పాయింట్ ను కూడా శిక్షగా స్వీకరించాడని ఐసీసీ వెల్లడించింది. మైదానంలోని అంపైర్ల ఫిర్యాదు మేరకు పంత్ పై ఈ శిక్ష విధించారు. ఇండియా, ఇంగ్లాండ్ తొలి టెస్టుకు నేడే చివరి రోజు. 10 వికెట్లు చేతిలో ఉన్న ఇంగ్లాండ్ ఇంకా 350 పరుగులు చేస్తే గెలుస్తుంది. అంతలోపే 10 వికెట్లూ పడగొడితే భారత్ దే విజయం. ఈ రెండూ జరగకపోతే మ్యాచ్ డ్రా అవుతుంది.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link