బనకచర్లకు అనుమతులిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతాం – సీఎం రేవంత్ రెడ్డి

Best Web Hosting Provider In India 2024

బనకచర్లకు అనుమతులిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతాం – సీఎం రేవంత్ రెడ్డి

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. రైతు నేస్తం కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఒకవేళ బనకచర్లకు కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామని స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసేంతవరకు ప్రభుత్వం రైతులకు అండగా నిలబడుతూనే ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పని చేస్తామని పునరుద్ఘాటించారు.

రైతు భరోసా కింద ఈ నెల 16 వ తేదీన రైతు ఖాతాల్లోకి డబ్బు వేయడం ప్రారంభించినప్పటి నుంచి చెప్పిన మాట ప్రకారం 9 రోజుల్లోగా 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. డా. బీఆర్ అంబేడ్కర్ రాష్ట్ర సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.

  • “గతంలో చెప్పినట్టుగానే 9 రోజుల్లో 9 వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఎకరాకు 12 వేల చొప్పున 1 కోటి 40 లక్షల ఎకరాలకు 70 లక్షల రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశాం.
  • రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి రైతులు మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాత క్రమంలో మహిళలు, తెలంగాణ ఉద్యమకారులైన యువతకు ప్రాధాన్యతనిస్తున్నాం. అందుకే అధికారం చేపట్టిన కొద్ది రోజుల్లోనే రైతు భరోసా కింద 7,625 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేశాం. వచ్చే పదేండ్లలో వ్యవసాయాన్ని పండుగ చేస్తాం.
  • అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులను ఆదుకోవడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో 25,35,964 మంది రైతులకు సంబంధించి 20,617 కోట్ల రూపాయలు చెల్లించి రుణ విముక్తులను చేశాం.
  • ధాన్యం సేకరించిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు చెల్లించడమే కాకుండా సన్న వడ్లు పండించిన వారికి బోనస్ ఇస్తున్నాం. 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధిక దిగుబడిని ఇచ్చి గర్వంగా చెప్పుకునే రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టారు.
  • రైతాంగానికి అండగా నిలబడాలన్న లక్ష్యంతోనే రుణ మాఫీ, రైతు భరోసా, సన్నవడ్లకు బోనస్, ఉచిత కరెంట్, స్ప్రింక్లర్స్, డ్రిప్, సోలార్ గిరి వికాసంలో పంపుసెట్లు, సివిల్ సప్లయ్ విభాగం ద్వారా ధాన్యం కొనుగోలు.. ఇలా కేవలం 18 నెలల కాలంలో వ్యవసాయ రంగంపై 1 లక్ష 04 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రజా ప్రభుత్వం ఇది.
  • ప్రజా పాలనలో రైతులు, మహిళలు, యువకుల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సోలార్ పవర్ ప్లాంట్లు, అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్వహణ, స్కూలు పిల్లల యూనిఫామ్ కుట్టించే బాధ్యత అప్పగించడం, స్వయం సహాయ సంఘాలకు సహాయం… ఇలా కోటి మంది కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం” అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

న్యాయస్థానాల్లో పోరాడుతాం – సీఎం రేవంత్ రెడ్డి

గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం అన్ని రకాలుగా పోరాడుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్రానికి ఫిర్యాదు చేశామన్నారు. ఒకవేళ కేంద్రం ప్రాజెక్టుకు అనుమతిస్తే న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు. బనకచర్లపై కేంద్ర ప్రభుత్వం ముందు రాష్ట్రం తెలిపిన అభ్యంతరాల విషయంలో అసెంబ్లీలో చర్చకు సిద్ధమని వివరించారు.

అధికారం చేపట్టిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల ప్రకటించిన రాజీవ్ యువ వికాసం ద్వారా యువకులను ఆదుకునే ప్రణాళికలతో ముందుకు వస్తామన్నారు. తదుపరి కార్యక్రమంగా రాజీవ్ యువ వికాసం చేపడుతామని వివరించారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్

Trending TelanganaTelangana NewsCm Revanth ReddyHyderabadBanakacherla ProjectRythu Bharosa
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024