



Best Web Hosting Provider In India 2024
కుమార్తెలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని ఆలయానికి విరాళంగా ఇచ్చిన తండ్రి
తండ్రితో వచ్చిన వివాదం ఆ కుమార్తెలకు ఆస్తి దక్కకుండా చేసింది. కుమార్తెలపై కోపంతో నాలుగు కోట్ల రూపాయలను ఓ తండ్రి ఆలయానికి ఇచ్చేశాడు.
ండ్రిని ఆస్తి విషయంలో కూతుళ్లు అవమానించారు. ఈ బాధను తట్టుకోలేని తండ్రి ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను ఆలయానికి విరాళంగా ఇచ్చేశాడు. ఇప్పుడు ఆ కుమార్తెలు ఆ ఆస్తిని పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఘటన తమిళనాడులోని తిరువణ్ణామలైలో జరిగింది. ఆయన విరాళం తర్వాత కూతుళ్లు ఇప్పుడు ఆ ఆస్తులను తిరిగి పొందేందుకు నానా తంటాలు పడుతున్నారు.
రిటైర్డ్ ఆర్మీ అధికారి అయిన ఎస్ విజయన్ తన కూతుళ్ల అవమానంతో ఎంతో బాధపడి ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 24న విరాళాల పెట్టెను తెరిచినప్పుడు అందులో నాణేలు, నోట్లతో పాటు రెండు ఒరిజినల్ ప్రాపర్టీ డాక్యుమెంట్లు లభించాయని అరుల్మిగు రేణుగంబల్ అమ్మవారి ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఒక ఆస్తి విలువ రూ.3 కోట్లు కాగా, మరొకటి రూ.కోటి ఉంటుందని చెప్పారు. ఈ రెండూ కలిపి రూ.4 కోట్ల ఆస్తి అవుతుంది. దీనిని తాను స్వచ్ఛందంగా ఆలయానికి ఆస్తిని అంకితం చేసినట్లు విజయన్ స్పష్టంగా పేర్కొంటూ లేఖను జత చేశారు.
అర్ని సమీపంలోని కేశవపురం గ్రామానికి చెందిన విజయన్.. రేణుగంబల్ అమ్మవారి పరమ భక్తుడు. గత పదేళ్లుగా ఆయన ఒంటరిగా ఉంటున్నట్లు ఆలయ అధికారుల విచారణలో తేలింది. భార్యతో విభేదాలు వచ్చాయి. ఇటీవలి కాలంలో ఆస్తిని అప్పగించాలని కూతుళ్లు ఒత్తిడి తెస్తూ రోజూ అవమానిస్తున్నారు.
‘నా సొంత ఖర్చుల కోసం కూడా నాకు డబ్బులు ఉండనివ్వడం లేదు. ఇప్పుడు ఈ ఆస్తిని నా జీవితాంతం ఆదరించిన దేవతకు అప్పగిస్తున్నాను.’ అని విజయన్ చెప్పారు.
విరాళాల పెట్టెలో పత్రాలను ఉంచినంత మాత్రాన ఆస్తి బదలాయింపుగా చట్టపరంగా పరిగణించలేమని ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సిలంబరసన్ తెలిపారు. దాతలు రిజిస్ట్రేషన్ శాఖలో నమోదు చేసుకుంటే తప్ప ఆలయానికి చట్టబద్ధమైన హక్కులు లభించవు. ప్రస్తుతానికి ఈ పత్రాలను హిందూ మత, ధర్మాదాయ శాఖ వద్ద భద్రంగా ఉంచారు. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలో ఉన్నతాధికారులు నిర్ణయిస్తారు.
విరాళంగా ఇచ్చిన ఆస్తుల్లో 10 సెంట్ల స్థలం ఆలయానికి సమీపంలోనే ఉన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇప్పుడు ఈ విషయం బయటకు పొక్కడంతో విజయన్ కూతుళ్లు ఆ ఆస్తిని తిరిగి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తన నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని విజయన్ స్పష్టం చేశారు. గుడితో మాట్లాడి న్యాయ ప్రక్రియ పూర్తి చేస్తానని గట్టిగా చెప్పేశారు. కుతూర్లు మాత్రం న్యాయస్థానానికి వెళ్లాలని చూస్తున్నారు.
టాపిక్
Best Web Hosting Provider In India 2024
Source link