జులై 15 నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్.. బైకులకూ FASTag తప్పనిసరి!

Best Web Hosting Provider In India 2024


జులై 15 నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్.. బైకులకూ FASTag తప్పనిసరి!

Anand Sai HT Telugu

మరికొన్ని రోజుల్లో ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వార్తలు వస్తున్నాయి. జులై 15 నుంచి దీనిని అమలు చేసే ఆలోచనలో ఉన్నారని సమాచారం.

ద్విచక్రవాహనాలకు టోల్

జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు ముగుస్తుంది. కొత్త టోల్ ఫీజును ప్రవేశపెట్టడం వెనక అనేక అంశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రధానంగా ఆదాయం, ట్రాఫిక్ నిర్వహణపై దృష్టి. ఫీజు అమలు చేయడం ద్వారా అన్ని వాహన వినియోగదారుల నుంచి రోడ్డు నిర్వహణ ఖర్చును వసూలు చేయవచ్చు. అన్ని వాహనాలకు డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి అని ప్రభుత్వం భావిస్తోంది.

జూలై 15 నుంచి!

జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫ్రీ ఉండదని తెలుస్తోంది. ఈ చర్యపై ప్రభుత్వం కీలకంగా చర్చిస్తుంది. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోంది.

FASTag ద్వారా వసూలు

భారతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ చెల్లించకుండా మినహాయింపు ఎప్పటి నుంచో ఉంది. దీనికి కారణం రోడ్డు మీద వాటి ప్రభావం తక్కువగా ఉండటం, ఈ వాహనాల నుండి టోల్ వసూలు చేయడానికి ఎక్కువ ఖర్చు కావడం కూడా ఓ కారణమే. ఇప్పుడు FASTag ద్వారా టోల్ వసులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ విషయం గురించి అధికారికంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. కానీ ఈ మార్పు కోసం ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి.

ద్విచక్ర వాహన యజమానులు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానిని వారి బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్‌కు లింక్ చేయాలి. సజావుగా టోల్ చెల్లింపుల కోసం వాహనానికి FASTagను అతికించాలి. అయితే నెలకు రూ.150 వసూలు చేస్తారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఇప్పటివరకూ క్లారిటీ లేదు.

టోల్ చెల్లింపు నమూనా!

ప్రభుత్వం కొత్త టోల్ చెల్లింపు నమూనాలను కూడా ద్విచక్రవాహనాలకు రూపొందించే అవకాశం ఉంది. ఇప్పటికే పెద్ద వాహనాలకు వార్షిక టోల్ పాస్ రూ. 3,000గా తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ప్రారంభంలో నాలుగు చక్రాల వాహనాలను లక్ష్యంగా చేసుకున్నా.. టోల్‌లోకి టూ వీలర్స్ కూడా వస్తున్నందున ఇలాంటిది ఏదైనా ప్రవేశపెట్టవచ్చు.

వారికి ఇబ్బందే!

నిజానికి మాన్యువల్ టోల్ వసూలు స్థానంలో డిజిటల్ వ్యవస్థలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడంతో ప్రయాణం సులభతరం అయిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు ద్విచక్రవాహనాలకు కూడా టోల్ వసూలు మెుదలుపెడితే పెద్ద ఎత్తున చర్చ జరగనుంది. కొందరు మౌలిక సదుపాయాల నిధుల కోసం సమానమైన చర్యగా చూస్తుండగా, మరికొందరు ద్విచక్ర వాహన వినియోగదారుల స్థోమత గురించి ఆలోచించాలని కొందరు చెబుతున్నారు. టూ వీలర్ మీద వెళ్లేవారిలో చాలామంది రోజువారీ ప్రయాణం, జీవనోపాధి కోసం తమ వాహనాలపై ఆధారపడతారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link