ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..

Best Web Hosting Provider In India 2024

ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..

Hari Prasad S HT Telugu

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ముంబైలో ల్యాండయ్యాడు. అయితే ఆ సమయంలో అతని చేతుల్లో ఉన్న పుస్తకం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆ బుక్ చూసి అతడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీకి రెడీ అయిపోతున్నాడని ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.

ఎన్టీఆర్ చేతుల్లో ఉన్న ఆ బుక్ ఏంటో తెలుసా? ముంబైలో ల్యాండైన మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఆ సినిమాకు సిద్ధమవుతూ..

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన బాలీవుడ్ డెబ్యూ మూవీ వార్ 2 కోసం బిజీగా ఉన్నాడు. ఓవైపు ప్రశాంత్ నీల్ తో మూవీ చేస్తూనే.. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న వార్ 2 పనుల్లోనూ నిమగ్నమయ్యాడు. ఈ క్రమంలో అతడు గురువారం (జూన్ 26) ముంబైలో ల్యాండవడం, ఆ సమయంలో అతని చేతుల్లో ఒక బుక్ కనిపించడం విశేషం.

ఎన్టీఆర్ చేతుల్లో ఆ బుక్ అందుకేనా?

జూనియర్ ఎన్టీఆర్ దేవర మూవీ తర్వాత వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఓవైపు వార్ 2, మరోవైపు ప్రశాంత్ నీల్ తో భారీ బడ్జెట్ మూవీ కొనసాగుతుండగానే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ మైథలాజికల్ మూవీ చేయబోతున్నట్లు కూడా కన్ఫమ్ అయింది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రొడ్యూసర్ నాగవంశీ వెల్లడించాడు. ఇప్పుడా సినిమా కోసమే ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు అతని చేతుల్లో ఉన్న పుస్తకం చూస్తే తెలుస్తోంది.

అతడు పట్టుకున్న ఆ బుక్ పేరు మురుగ ది గాడ్ ఆఫ్ వార్ ది గాడ్ ఆఫ్ విజ్డమ్. ఆనంద్ బాలసుబ్రమణియన్ రాసిన బుక్ ఇది. ఇప్పుడు త్రివిక్రమ్ సుబ్రమణ్యస్వామిపై ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ తీయబోతున్న నేపథ్యంలో దానికి ముందే మురుగన్ స్టోరీ తెలుసుకోవడానికి ఎన్టీఆర్ ఈ బుక్ చదువుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ బుక్ ఆధారంగానే వస్తోందా?

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కోసం ఓ పుస్తకాన్ని ఆధారంగా తీసుకోబోతున్నట్లు తెలిసింది. ఆ పుస్తకం ఇదేనా అన్న సందేహాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో రూపొందించబోతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. మొదట అల్లు అర్జున్ తో అనుకున్నా.. తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో ఈ మూవీని కన్ఫమ్ చేశారు.

ఇక ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్ట్స్ మూవీ వార్ 2 కోసం సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా ఆగస్ట్ 14న థియేటర్లలో రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలలోనూ ఈ మూవీ రానుంది. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇందులో అతనిది నెగటివ్ రోల్ కావడం విశేషం. లీడ్ రోల్లో హృతిక్ రోషన్ నటిస్తున్నాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024