మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్

Best Web Hosting Provider In India 2024

మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్

Hari Prasad S HT Telugu

తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ కథ విషయంలో ఈటీవీ విన్, జీ5 ఓటీటీ మధ్య వివాదం ముదురుతోంది. గురువారం (జూన్ 26) ఈటీవీ విన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. తమదే అసలైన లైసెన్స్‌డ్ గన్ అని చెప్పిన ఆ ఓటీటీ తమ కానిస్టేబుల్ కనకం త్వరలోనే రానుందని వెల్లడించింది.

మాదే అసలైన లైసెన్స్‌డ్ గన్.. వాళ్లవి దీపావళి డమ్మీ గన్స్: తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్‌ వివాదంపై ఈటీవీ విన్ పోస్ట్ వైరల్

తెలుగులో థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ శుక్రవారం (జూన్ 27) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న విషయం తెలుసు కదా. అయితే దీని ఒరిజినల్ కథ తమదని ఈటీవీ విన్ వాదిస్తోంది. ఇప్పటికే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ దీనిపై న్యాయపోరాటం చేస్తున్నట్లు చెప్పాడు. ఇక తాజాగా ఈటీవీ విన్ ఓటీటీ చేసిన ట్వీట్ ఒకటి వైరల్ అవుతోంది.

ఈటీవీ విన్ పోస్ట్ ఇలా..

నిజానికి ఈటీవీ విన్ కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ ను చాలా రోజుల కిందటే అనౌన్స్ చేసింది. ఇప్పుడు జీ5 ఓటీటీలో వస్తున్న విరాటపాలెం కథ తమదే అని ఆ ఓటీటీ వాదిస్తోంది. తాజాగా తమదే ఒరిజినల్ గన్ అని, మిగిలినవి దీపావళి డమ్మీ గన్స్ అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు త్వరలోనే తమ కానిస్టేబుల్ కనకం రాబోతుందని కూడా వెల్లడించింది.

“కానిస్టేబుల్ కనకం ఒరిజినల్ లైసెన్స్‌డ్ గన్ కేవలం ఈటీవీ విన్ దగ్గరే ఉంది. డమ్మీ దీపావళి గన్స్ అవసరం లేదు. కానిస్టేబుల్ కనకం త్వరలోనే వస్తోంది. కోవెలమూడి సత్య సాయిబాబా, వేమూరి హేమంత్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. ప్రశాంత్ కుమార్ దిమ్మల డైరెక్ట్ చేయగా.. సురేష్ బొబ్బిలి మ్యూాజిక్ అందించాడు” అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది.

అసలు వివాదం ఏంటి?

విరాటపాలెం పీసీ మీనా రిపోర్టింగ్ అనే థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను జీ5 ఓటీటీ శుక్రవారం (జూన్ 27) ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. అయితే ఈ కథను తాను గతంలో ఆ ఓటీటీకి చెప్పానని, వాళ్లు కాదనడంతో ఈటీవీ విన్ తో చేశానని, కానీ ఇప్పుడదే కథతో వాళ్లు తీయడం అన్యాయమని డైరెక్టర్ ప్రశాంత్ వాదిస్తున్నాడు. దీనిపై కోర్టుకు కూడా వెళ్లినట్లు చెప్పాడు. ఇదే కథతో కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ను ఈటీవీ విన్ రూపొందించింది.

పెళ్లి రోజే పెళ్లికూతుళ్లు కన్నుమూయడం అనే మిస్టరీ చుట్టూ తిరిగే కథ ఇది. బుధవారం (జూన్ 25) ప్రెస్ మీట్ పెట్టి కానిస్టేబుల్ కనకం మేకర్స్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. గతంలో ఓసారి ఆ ఓటీటీకి తన కథ చెప్పి, పూర్తి స్క్రీన్ ప్లే పంపించానని, ప్రాజెక్ట్ కొంత పూర్తయిన తర్వాత వాళ్లు వద్దనడంతో తాను ఈటీవీ విన్ ను ఆశ్రయించినట్లు చెప్పాడు.

ఈలోపే వాళ్లు మరొకరితో అదే కథతో ఈ వెబ్ సిరీస్ తీశారని, ఈ మధ్యే ట్రైలర్ చూసి తాను షాక్ తిన్నట్లు తెలిపాడు. దీంతో తాము కోర్టుకు వెళ్లామని, ప్రస్తుతం కేసు నడుస్తోందని వెల్లడించాడు. ఇలాంటి పరిస్థితి వస్తుందని తాను ఊహించలేదని అన్నాడు. నటి వర్ష బొల్లమ్మతో కానిస్టేబుల్ కనకం మూవీని గతేడాది డిసెంబర్లో అనౌన్స్ చేశారు. ఆ కథ తనదే అని, వాళ్లు కాపీ కొట్టారనడానికి అన్ని ఆధారాలు ఉన్నట్లు చెప్పాడు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024