




Best Web Hosting Provider In India 2024
సీబీఎస్ఈ క్లాస్ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్ అప్డేట్- తేదీలు ఇవే..
సీబీఎస్ఈ క్లాస్ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్ అప్డేట్! పరీక్షల డేట్షీట్ని సీబీఎస్ఈ ప్రకటించింది. జులైలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్ఈ 10వ, 12వ తరగతులకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తాజగా విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు జులై 15 నుంచి జులై 22 వరకు జరుగుతాయి. కాగా, 12వ తరగతి పరీక్ష జులై 15న ఒకే రోజులో నిర్వహించడం జరుగుతుంది.
సీబీఎస్ఈ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు..
సీబీఎస్ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లతో ప్రారంభమవుతాయి. 12వ తరగతికి సంబంధించిన అన్ని పేపర్లు ఒకే రోజు ఉంటాయి.
రెండు తరగతులకు సంబంధించిన పరీక్షలు కొన్ని రోజులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మరికొన్ని రోజులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు సబ్జెక్టును బట్టి జరుగుతాయి.
సీబీఎస్ఈ సప్లిమెంటరీ పరీక్షలు- విద్యార్థులకు ముఖ్య సూచనలు..
పరీక్షా కేంద్రంలోకి కమ్యూనికేషన్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధం. వీటిని కలిగి ఉన్నా లేదా ఉపయోగించినా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.
పరీక్షా కేంద్రంలో విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి.
ప్రతి పరీక్ష సమయం డేట్ షీట్లో, అడ్మిట్ కార్డులో స్పష్టంగా ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వాలి.
పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రం చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇస్తారు.
తాజా అప్డేట్ల కోసం అభ్యర్థులు అధికారిక సీబీఎస్ఈ వెబ్సైట్ను క్రమం తప్పకుండా చెక్ చేస్తూ ఉండాలి.
2025 బోర్డు పరీక్షల ఫలితాలు..
సీబీఎస్ఈ 2025 సంవత్సరానికి సంబంధించిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను మే 13న ప్రకటించింది. 12వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39%గా నమోదైంది. ఇది గత సంవత్సరం కంటే స్వల్పంగా పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే, విజయవాడ 99.60% ఉత్తీర్ణత శాతంతో 12వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 10వ తరగతికి సంబంధించి, మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా ఉండగా, తిరువనంతపురం 99.79%తో అత్యుత్తమ పనితీరు కనబరచిన ప్రాంతంగా నిలిచింది.
ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్ఈ 10 పరీక్షలు..
మరో వార్తలో.. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ ఇటీవలే ప్రకటించింది. ఫిబ్రవరిలో అందరు తప్పనిసారిగా పరీక్ష రాయాలి. మే నెలలో నిర్వహించే పరీక్షలు ఆప్షనల్గా ఉంటాయి. మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే వారు మే నెలలో జరిగే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు.
రెండు దశల పరీక్షల ఫలితాలను ఏప్రిల్, జూన్లో విడుదల చేస్తారు. కాగా ఇంటర్నల్ అసెస్మెంట్ మాత్రం ఒక్కసారే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link