సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్​ అప్డేట్- తేదీలు ఇవే..

Best Web Hosting Provider In India 2024


సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్​ అప్డేట్- తేదీలు ఇవే..

Sharath Chitturi HT Telugu

సీబీఎస్​ఈ క్లాస్​ 10, 12 సప్లిమెంటరీ పరీక్షలపై బిగ్​ అప్డేట్! పరీక్షల డేట్​షీట్​ని సీబీఎస్​ఈ ప్రకటించింది. జులైలో ఈ పరీక్షలు జరగనున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

సీబీఎస్​ఈ పరీక్షల్లో ఫెయిల్​ అయితే? (Pixabay)

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సీబీఎస్​ఈ 10వ, 12వ తరగతులకు సంబంధించిన సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తాజగా విడుదల చేసింది. 10వ తరగతి పరీక్షలు జులై 15 నుంచి జులై 22 వరకు జరుగుతాయి. కాగా, 12వ తరగతి పరీక్ష జులై 15న ఒకే రోజులో నిర్వహించడం జరుగుతుంది.

సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షల వివరాలు..

సీబీఎస్​ఈ 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్‌లతో ప్రారంభమవుతాయి. 12వ తరగతికి సంబంధించిన అన్ని పేపర్లు ఒకే రోజు ఉంటాయి.

రెండు తరగతులకు సంబంధించిన పరీక్షలు కొన్ని రోజులు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మరికొన్ని రోజులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు సబ్జెక్టును బట్టి జరుగుతాయి.

సీబీఎస్​ఈ సప్లిమెంటరీ పరీక్షలు- విద్యార్థులకు ముఖ్య సూచనలు..

పరీక్షా కేంద్రంలోకి కమ్యూనికేషన్ పరికరాలు తీసుకురావడం పూర్తిగా నిషేధం. వీటిని కలిగి ఉన్నా లేదా ఉపయోగించినా అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.

పరీక్షా కేంద్రంలో విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి.

ప్రతి పరీక్ష సమయం డేట్​ షీట్​లో, అడ్మిట్ కార్డులో స్పష్టంగా ఉంటుంది. దాన్ని ఫాలో అవ్వాలి.

పరీక్ష ప్రారంభానికి ముందు ప్రశ్నపత్రం చదవడానికి విద్యార్థులకు 15 నిమిషాల సమయం ఇస్తారు.

తాజా అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు అధికారిక సీబీఎస్​ఈ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా చెక్​ చేస్తూ ఉండాలి.

2025 బోర్డు పరీక్షల ఫలితాలు..

సీబీఎస్​ఈ 2025 సంవత్సరానికి సంబంధించిన 10, 12వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలను మే 13న ప్రకటించింది. 12వ తరగతి మొత్తం ఉత్తీర్ణత శాతం 88.39%గా నమోదైంది. ఇది గత సంవత్సరం కంటే స్వల్పంగా పెరిగింది. ప్రాంతాలవారీగా చూస్తే, విజయవాడ 99.60% ఉత్తీర్ణత శాతంతో 12వ తరగతి ఫలితాల్లో అగ్రస్థానంలో నిలిచింది. 10వ తరగతికి సంబంధించి, మొత్తం ఉత్తీర్ణత శాతం 93.66%గా ఉండగా, తిరువనంతపురం 99.79%తో అత్యుత్తమ పనితీరు కనబరచిన ప్రాంతంగా నిలిచింది.

ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు సీబీఎస్​ఈ 10 పరీక్షలు..

మరో వార్తలో.. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనున్నట్టు సీబీఎస్​ఈ ఇటీవలే ప్రకటించింది. ఫిబ్రవరిలో అందరు తప్పనిసారిగా పరీక్ష రాయాలి. మే నెలలో నిర్వహించే పరీక్షలు ఆప్షనల్​గా ఉంటాయి. మార్కులను మెరుగుపరుచుకోవాలనుకునే వారు మే నెలలో జరిగే ఎగ్జామ్స్​ రాసుకోవచ్చు.

రెండు దశల పరీక్షల ఫలితాలను ఏప్రిల్​, జూన్​లో విడుదల చేస్తారు. కాగా ఇంటర్నల్​ అసెస్​మెంట్​ మాత్రం ఒక్కసారే ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link