




Best Web Hosting Provider In India 2024

ఉద్యోగాల భర్తీకి టీటీడీ నోటిఫికేషన్ – నెలకు మంచి జీతం, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా
టీటీడీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీలోపు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…..
టీటీడీ ఉద్యోగ భర్తీ ప్రకటన
తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 10వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
టీటీడీ విడుదల చేసిన నోటిఫికేషన్ వివరాల ప్రకారం… పుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఖాళీలు 3 ఉండగా… సీనియర్ పుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టు ఒకటి ఉంది. విద్యా అర్హత మెరిట్ మార్కులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి మంచి జీతం చెల్లిస్తారు.
టీటీడీ ఉద్యోగాలు – ముఖ్య వివరాలు
- ఉద్యోగ ప్రకటన – తిరుమల తిరుపతి దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.
- ఉద్యోగ ఖాళీలు – 04
- ఖాళీల వివరాలు – పుడ్ సెఫ్టీ ఆఫీసర్ ఖాళీలు 3, సీనియర్ పుడ్ సెఫ్టీ ఆఫీసర్ – 01.
- కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
- పుడ్ టెక్నాలజీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 42 ఏళ్లలోపు ఉండాలి.
- ఎంపికైన వారు తిరుమలలోని అన్న ప్రసాదం కౌంటర్ మరియు తిరుమలలో ఉన్న దుకాణాలు హోటల్స్ లో తనిఖీ చేసే బాధ్యతలను నిర్వర్తించాలి.
- పుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 47,400, సీనియర్ పుడ్ సెఫ్టీ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన వారికి నెలకు రూ. 61,960 జీతం చెల్లిస్తారు.
- దరఖాస్తు విధానం – ఆఫ్ లైన్ లో చేసుకోవాలి.
- దరఖాస్తు ఫారమ్ ను https://tirumala.org/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయాలి.
- 10 జూలై 2025 లోపు “ది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్డు, తిరుపతి, ఆంధ్రప్రదేశ్” చిరునామాలో సమర్పించాలి.
ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ పీడీఎఫ్ పొందవచ్చు, ఇందులో అప్లికేషన్ ఫామ్ కూడా ఉంటుంది.
టాపిక్
RecruitmentAp GovtAndhra Pradesh News