





Best Web Hosting Provider In India 2024

మూడు ఓటీటీల్లోకి వచ్చిన తెలుగు సినిమా.. స్ట్రీమింగ్ తర్వాత మంచి రెస్పాన్స్
23 సినిమా యథార్థ ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ చిత్రం తాజాగా ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో అడుగుపెట్టింది. స్ట్రీమింగ్ తర్వాత నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంటోంది.
తేజ, తన్మయి ఖుషి ప్రధాన పాత్రలు పోషించిన ‘23’ (ఇరవై మూడు) సినిమా మే 16వ తేదీన థియేటర్లలో విడుదలైంది. మూడు యథార్థ ఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. మల్లేశం, 7ఏఎం మెట్రో లాంటి హార్ట్ టచ్చింగ్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ ఆర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. థియేట్రికల్ రిలీజ్లో ఈ చిత్రం మిక్స్డ్ టాక్ దక్కించుకుంది. ఈ 23 సినిమా తాజాగా మూడు ఓటీటీల్లోకి అడుగుపెట్టింది.
స్ట్రీమింగ్ వివరాలు.. మూడు ఓటీటీల్లో
23 చిత్రం ఇదే వారంలో ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, ఈటీవీ విన్ ఓటీటీల్లో ఈ స్ట్రీమింగ్కు వచ్చింది. ఎక్కువ మందికి అందుబాటులో ఉండేలా మూడు ఓటీటీల్లో ఈ చిత్రం అడుగుపెట్టింది.
మూడు ఘటనల ఆధారంగా..
23 సినిమా మూడు యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కింది. చుండూరు ఊచకోత (1991), చిలకలూరి పేట బస్సు దగ్ధం (1993), జూబ్లిహిల్స్ కారు పేలుడు (1997) ఘటనల ఆధారంగా ఈ మూవీని దర్శకుడు రాజ్ రూపొందించారు. ఎక్కువగా 1993 బ్యాక్డ్రాప్లో సాగుతుంది. కులం, అధికారం, ఆధిపత్యం, అణచివేత, వివిధ వ్యవస్థలు లాంటి సామాజిక అంశాలు ఈ చిత్రంలో ప్రధానంగా ఉంటాయి.
పాజిటివ్ రెస్పాన్స్
ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత 23 చిత్రానికి ఎక్కువగా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీల్లో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ చిత్రం గురించి పోస్టులు చేస్తున్నారు. ఈ మూవీ ఎమోషనల్గా సాగిందని, ఆ ఘటనల దారుణ పరిస్థితులను చూపించిందని అంటున్నారు. సమాజంలోని అసమానతలను, రకరకాల సమస్యలను దర్శకుడు హార్డ్ హిట్టింగ్గా చూపించారని కామెంట్లు చేస్తున్నారు. మొత్తంగా స్ట్రీమింగ్ తర్వాత పాజిటివ్ స్పందనను ఈ మూవీ దక్కించుకుంటోంది.
23 సినిమాలో తేజ, తన్మయితో పాటు ఝాన్సీ, పవన్ రమేశ్, ప్రణీత్, తాగుబోతు రమేశ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మార్క్ కే రాబిన్ సంగీతం అందించారు. ఈ సినిమాను వెంకట్ సిద్ధారెడ్డి నిర్మించారు. ఈ మూవీకి సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ చేయగా.. అనిల్ ఆలయం ఎడిటింగ్ చేశారు.
సంబంధిత కథనం