




Best Web Hosting Provider In India 2024
టంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు!
దిల్లీకి చెందిన ఓ వ్యక్తి, తన తండ్రిని చంపేశాడు! ఇల్లు షిఫ్టింగ్ సమయంలో టెంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో తుపాకీతో తండ్రిని కాల్చి హత్య చేశాడు.
దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెంపో వెహికిల్లో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో, ఓ 26ఏళ్ల వ్యక్తి, తన తండ్రిని కాల్చి చంపేశాడు!
ఇదీ జరిగింది..
ఉత్తర దిల్లీ తిమర్పుర్ అనే ప్రాంతంలోని ఎంఎస్ బ్లాక్ వద్ద గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఈ ఘటన. 60ఏళ్ల సురేంద్ర సింగ్ సీఐఎస్ఎఫ్ సబ్-ఇన్స్పెక్టర్గా ఇటీవలే రిటైర్ అయ్యాడు. అనంతరం, తన కుటుంబాన్ని దిల్లీ నుంచి ఉత్తరాఖండ్లోని స్వస్థలానికి షిఫ్ట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక టెంపోని మాట్లాడాడు.
టెంపోలో సామాన్లు ఎక్కిస్తుండగా.. కుమారుడు దీపక్తో సురేంద్ర సింగ్కి వాగ్వాదం మొదలైంది. ఫ్రెంట్ సీటులో ఎవరు కూర్చోవాలి? అన్న విషయంపై ఇద్దరు గొడవపడినట్టు తెలుస్తోంది.
ఇంతలో దీపక్ అగ్రెసివ్ అయ్యాడు. తండ్రి లైసెన్స్డ్ గన్ వెతికి, తీసుకొచ్చి, సురేంద్ర సింగ్పై కాల్పులు జరిపాడు.
అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. దీపక్ మీద పడి, అతడి నుంచి గన్ని లాక్కునే ప్రయత్నం చేశారు.
- అప్పు తీర్చలేక స్నేహితుడికి భార్యను అమ్మిన భర్త. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే, ఈ ఘటన జరిగిన వీధి నుంచి కొంత దూరంలో పోలీసు పాట్రోలింగ్ వెహికిల్ ఉంది. కాల్పుల శబ్దం వినిపించగానే పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు.
రక్తపుమడుగులో పడి ఉన్న సురేంద్ర సింగ్ని పోలీసులు చూశారు. గన్ పట్టుకుని అక్కడే నిలబడ్డ దీపక్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
ఆ వెంటనే సురేంద్ర సింగ్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థరించారు.
భార్యను చంపిన 75ఏళ్ల వృద్ధుడు..!
దేశంలో నేరాలు రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ఓ 75ఏళ్ల వృద్ధుడు, తన భార్యను దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో ఇటీవలే చోటుచేసుకుంది.
నిందితుడి పేరు రంగయ్య. ఆయనకు చిన్న కిరాణ కొట్టు ఉంది. వంటి విషయంలో భార్య తిమ్మమ్మతో ఎప్పుడు గొడవపడే వాడు. గురువారం భార్యతో వివాదం ముదిరింది. ఇంతలో కత్తి తీసుకున్న రంగయ్య భార్యపై దాడి చేశాడు. ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయంది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రంగయ్య దగ్గర ఫోన్ లేకపోవడంతో ఆయన్ని ట్రాక్ చేయడం కష్టంగా మారింది. అయితే, ఆయన తరచూ తిరుపతికి వెళుతుంటాడని రంగయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని బస్ స్టాండ్లపై నిఘా పెట్టారు.
కొన్ని గంటల తర్వాత నిందితుడిని రామనగరలోని బస్ స్టాండ్ దగ్గర అరెస్ట్ చేశారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link