పెంపుడు కుక్క గొంతు కోసి బలి ఇచ్చి, క్షుద్ర పూజలు చేసిన యువతి; బెంగళూరులో దారుణం

Best Web Hosting Provider In India 2024


పెంపుడు కుక్క గొంతు కోసి బలి ఇచ్చి, క్షుద్ర పూజలు చేసిన యువతి; బెంగళూరులో దారుణం

Sudarshan V HT Telugu

బెంగళూరులో ఓ మహిళ తన లాబ్రడార్ పెంపుడు కుక్కను గొంతు కోసి హత్య చేసింది. అనంతరం, ఆ కుక్క మొండాన్ని తన ఫ్లాట్ లోనే దాచి పెట్టింది. ఫ్లాట్ లో నుంచి దారుణమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన అపార్ట్మెంట్ వాసులు.

పెంపుడు కుక్క గొంతు కోసి బలి ఇచ్చిన యువతి

ఒక యువతి తన పెంపుడు కుక్కను గొంతు కోసి బలి ఇచ్చిన ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. అనంతరం, ఆ కుక్క మృతదేహాన్ని తన ఫ్లాట్ లోనే దాచి పెట్టింది. ఫ్లాట్ లో నుంచి దారుణమైన దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారమిచ్చిన అపార్ట్మెంట్ వాసులు. ఫ్లాట్ లో క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు.

లాబ్రడార్ బలి

పశ్చిమబెంగాల్ కు చెందిన త్రిపర్ణా పైక్ అనే ఓ మహిళ తన పెంపుడు కుక్క లాబ్రడార్ ను గొంతు నులిమి చంపి దాని కుళ్లిపోయిన శవాన్ని చాలా రోజుల పాటు బెంగళూరులోని తన అపార్ట్ మెంట్ లో ఉంచింది. నిందితురాలు త్రిపర్ణా పైక్ తన మూడు లాబ్రడార్ కుక్కలలో ఒకదాని గొంతు కోసి, ఆపై మృతదేహాన్ని మహదేవపురలోని తన అపార్ట్మెంట్లో గుడ్డలో చుట్టి పెట్టింది. కుళ్లిపోయిన కుక్క నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారి దృష్టికి రావడంతో వారు బెంగళూరు నగరపాలక సంస్థ (బీబీఎంపీ)కి సమాచారం అందించారు.

క్షుద్ర పూజల ఆనవాళ్లు

అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోగానే త్రిపర్ణా పైక్ వారిని తన ఫ్లాట్ లోకి రావడాన్ని ప్రతిఘటించింది. లోపలికి వస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దాంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి బలవంతంగా ఆ ఫ్లాట్ లోనికి వెళ్లారు. లోపల కుళ్లిపోయిన ఒక కుక్క మృతదేహం, మరో రెండు శునకాలు కనిపించాయి. బతికి ఉన్న రెండు శునకాలు కూడా తీవ్ర నిర్లక్ష్యానికి గురైనట్లు కనిపించాయి. కాగా, త్రిపర్ణ ఫ్లాట్ మొత్తం దేవతల చిత్రాలు, పూజా వస్తువులతో నిండి ఉంది. ఇక్కడ “తాంత్రిక” లేదా క్షుద్ర పూజలు చేసి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

గతంలో నాలుగు లాబ్రడార్లు

పోస్టుమార్టం రిపోర్టులో నాలుగు రోజుల క్రితమే కుక్క చనిపోయినట్లు తేలింది. ఫ్లాట్ పూర్తిగా మూసి ఉండడం, వెంటిలేషన్ లేకపోవడం వల్ల తీవ్రమైన, భరించలేని దుర్వాసన వస్తోందని, ఇది చుట్టుపక్కల నివాసితులలో ఆరోగ్య సమస్యలను పెంచిందని అధికారులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత సంబంధిత సెక్షన్లతో పాటు జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద త్రిపర్ణపై కేసు నమోదైంది. ప్రాణాలతో బయటపడిన కుక్కలను రెస్క్యూ, పునరావాసం కోసం పరిశీలిస్తున్నారు. గతంలో త్రిపర్ణ వద్ద నాలుగు లాబ్రడార్ లు ఉండేవని, నాలుగు నెలల క్రితం వాటిలో ఒకటి కనిపించకుండా పోయిందని స్థానికులు చెప్పారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link