పాకిస్థాన్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి: 13 మంది సైనికులు మృతి

Best Web Hosting Provider In India 2024


పాకిస్థాన్ లో ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి: 13 మంది సైనికులు మృతి

Sudarshan V HT Telugu

వాయవ్య పాకిస్థాన్ లో శనివారం సైనిక వాహన శ్రేణిపై జరిగిన ఆత్మాహుతి దాడిలో 13 మంది సైనికులు మరణించారు. 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు.

పాక్ ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి (Representative photo/AFP)

పాకిస్థాన్ లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోని ఉత్తర వజీరిస్థాన్ జిల్లాలో సైనిక కాన్వాయ్ పై ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో దూసుకెళ్లడంతో 13 మంది సైనికులు మృతి చెందారు. 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు. ‘ఆత్మాహుతి బాంబర్ పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో పాకిస్తాన్ మిలటరీ కాన్వాయ్ లోకి దూసుకెళ్లాడు. ఈ పేలుడులో 13 మంది సైనికులు మరణించగా, 10 మంది సైనికులు, 19 మంది పౌరులు గాయపడ్డారు’ అని పాక్ ఆర్మీ అధికారి విలేకరులకు తెలిపారు.

భారీ పేలుడు; ఎగిరిపోయిన ఇళ్ల పై కప్పులు

పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు కూడా ధ్వంసమయ్యాయి. పేలుడు ధాటికి రెండు ఇళ్ల పైకప్పులు కూలాయని, ఆరుగురు చిన్నారులు గాయపడ్డారని ఖైబర్ పఖ్తుంఖ్వాలో విధులు నిర్వహిస్తున్న ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించకపోయినప్పటికీ ఈ ప్రాంతంలో తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) తరచూ దాడులు చేస్తుంటుంది. పాకిస్థాన్ అంతటా, ముఖ్యంగా ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్తాన్ ప్రాంతాల్లో మిలిటెంట్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో తాజా ఆత్మాహుతి దాడి జరగడం గమనార్హం.

గతంలో కూడా పలు దాడులు

ఈ ఏడాది మార్చిలో 10 మంది టీటీపీ మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. వారు దక్షిణ వజీరిస్థాన్ లోని జండోలా చెక్ పోస్టు సమీపంలోని ఫ్రాంటియర్ కార్ప్స్ క్యాంప్ ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడిన సమయంలో ఎదురు కాల్పుల్లో వారిని హతమార్చామని వెల్లడించింది. అలాగే మార్చిలో నెలలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA)కి చెందిన మిలిటెంట్లు గుడాలార్ మరియు పిరు కున్రి సమీపంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ప్యాసింజర్ రైలుపై దాడి చేసి 21 మంది ప్రయాణికులు మరియు నలుగురు పారామిలిటరీ సైనికులను చంపారు.

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025

గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రకారం, పాకిస్తాన్ ఉగ్రవాద సంబంధిత మరణాలలో 2024 లో 45% పెరుగుదలను నమోదు చేసింది. ఇది 2023 లో 748 నుండి 2024లో 1,081 కి పెరిగింది. పాకిస్తాన్ ఉగ్రవాద మరణాల పరంగా ప్రపంచవ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link