





Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కన్నీళ్లు పెట్టుకున్న కార్తీక్.. కాంచన కాళ్లు పట్టుకున్న శ్రీధర్.. జ్యోత్స్న కంగారు
కార్తీక దీపం 2 సీరియల్ జూన్ 30 ఎపిసోడ్ లో తల్లికి జరిగిన ప్రమాదం తలుచుకుంటూ ఎమోషనల్ అవుతాడు కార్తీక్. మరోవైపు కార్తీక్ కుటుంబం కలిసిపోతుందేమోనని పారిజాతం, జ్యోత్స్న కంగారు పడుతుంటారు. కాంచన ఇంటికి వెళ్లిన శ్రీధర్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఈ రోజు ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.
కార్తీక దీపం 2 సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ లో దశరథ్ గురించి తన తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఒంటరిగా కూర్చుంటాడు కార్తీక్. అప్పుడే దీప వచ్చి కార్తీక్ కళ్లలో నీళ్లు చూసి.. అదేంటీ ఏడుస్తున్నావా? అని అడుగుతుంది. అత్తయ్య ఏం కాలేదు కదా అంటుంది. ఏదైనా అయి ఉంటే, నాన్న ఉన్నా లేనట్టే ఉన్నది అమ్మే కదా నీ మీద కోపంతో జ్యోత్స్న చేస్తున్న పనులకు కంట్రోల్ చేసుకోవడం నా వల్ల కావడం లేదు దీప. వెళ్లి లాగిపెట్టి కొట్టి ఇది మీ కూతురు కాదు దాసు మామయ్య కూతురు అని దశరథ్ మామయ్యతో చెప్పాలని ఉంది అని కార్తీక్ అంటాడు.
బంధాలకు విలువ లేదు
అలా చేస్తే మనం అనుకున్నది జరుగుతుందా? అని దీప అంటే.. అందుకే ఆగిపోతున్నా అని కార్తీక్ అంటాడు. కానీ ఎవరిని దూరం చేసుకుంటానో అని భయంగా ఉంది అని కార్తీక్ వర్రీ అవుతాడు. సుమిత్ర అత్తకు మా అమ్మంటే చాలా ఇష్టం కానీ ఇప్పుడు పలకరించడానికి కూడా రాలేదు, ఆ బంధాలకు విలువ లేదు దీప అని కార్తీక్ అంటాడు. అలా కాదు బావ మా నాన్న చెల్లెలు కోసం కారు తీసుకుని వచ్చాడు, అదే రక్త బంధం.. తాతయ్యకు అత్త గురించి తెలియగానే ఎంత సీరియస్ అయ్యాడో చూశావో కదా అది తన కూతురు మీద తనకున్న ప్రేమ అని దీప చెబుతుంది.
మనం కలపాలి
వీడియో కాల్ లో కూతురును చూసుకుని మరీ వెళ్లాడు తాతయ్య, బంధాలు బతికే ఉన్నాయని అనేందుకు ఇంతకుమించింది ఏముంటుంది బావ అని దీప అంటుంది. నాకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి అత్త అంటే అమ్మకు నచ్చడం లేదు, కానీ ఎన్ని రోజులు జీవితాంతం ఇలాగే ఉండలేరు అని దీప చెప్తుంది. తొందర్లో అందరూ కలుస్తారు, మనం కలపాలి, మన లక్ష్యాన్ని మనమే మర్చిపోతే ఎలా అని ప్రశ్నిస్తుంది దీప. మర్చిపోలేదు దీప కానీ నా బలహీనత అమ్మ అని తెలుసు కదా, అమ్మకు ఏదైనా జరిగితే తట్టుకోలేను అని కార్తీక్ అంటాడు.
ఆ ఇంట్లో ఆడపడుచుల స్థానంలో మీ ఇద్దరినీ చూడాలి అని కార్తీక్ అంటాడు. 70 ఏళ్లు వచ్చినా అమ్మ గుర్తు రాగానే ఏడుపు వస్తుందని కార్తీక్ చెప్తాడు.
నేనే విలన్ లా
తాతయ్య దీపకు సారీ చెప్పించడంతో జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది. అప్పుడే జ్యో రూమ్ లోకి వచ్చిన పారిజాతం బ్యాగ్ సర్దుతుంది. ఏం చేస్తున్నావ్ అంటే నిన్ను ఎక్కడికైనా రెండు నెలలు దూరంగా పంపిద్దామని అని పారు అంటుంది. ఇద్దరి మధ్య మాటామాట పెరుగుతుంది. నీకు దమ్ముంటే ఈ పారిజాతాన్ని టచ్ చేయు అని సవాలు విసురుతుంది. చూసేవాళ్లకు దీప విలన్ లా లేదు నేను విలన్ లా ఉన్నా అని జ్యో అంటుంది. మనం విలన్సే కానీ చూసేవాళ్లకు మీ బావ కమెడియన్లను చేసేశాడు అంటుంది పారు.
తాత వెళ్లినా
నీ పనులు చూస్తుంటే పార్టీ మార్చడమే బెటర్ అనిపిస్తుందని పారు అంటుంది. తప్పు చేసినా దొరక్కూడదు అని ఎన్నిసార్లు చెప్పా, మనం వదిలిస్తే కాంచన, శివన్నారాయణ కలిసిపోయేలా ఉన్నారు. ఇంతకుముందే దశరథ్ కార్తీక్ కు వీడియో కాల్ చేసి కాంచనను మీ తాతకు చూపించాడు. కూతురు ఎలా ఉందో చూసుకోవాలని ముసలోడికి అనిపించే పరిస్థితి నువ్వే తీసుకొచ్చావు. దీపను ఆపడం వల్ల దశరథ్ వెళ్లాడు. మీ తాత వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కుటుంబాన్ని విడగొట్టి నిన్ను మహారాణిలా చూడాలనుంటే నీ అహంకారంతో వాళ్లందరినీ కలుపుతున్నావు అని జ్యోపై మండిపడుతుంది పారు.
కాంచన ఇంట్లో శ్రీధర్
మరోవైపు కాంచన దగ్గరకు శ్రీధర్ వస్తాడు. ఒంటికి తగ్గిన గాయాలకు మాత్రలు కావాలి అని కాంచనకు శ్రీధర్ టాబ్లెట్ ఇస్తాడు. మాత్రలతో ఒంటికి తగిలిన గాయాలు మానిపోతాయి కానీ మనసుకు తగిలిన గాయాలు ఏం చేసినా ఈ జన్మకు మానవు అని కాంచన అంటుంది. నీ మీద నేను చూపించే ప్రేమ నిజం కాంచన అని చెప్తాడు శ్రీధర్. అప్పుడు హాల్లోకి వచ్చిన అనసూయ శ్రీధర్ ను చూసి మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది.
రాంగ్ అడ్రస్
నా భార్య కోసం అని రిప్లే ఇస్తాడు శ్రీధర్. అయితే మీరు రాంగ్ అడ్రస్ కు వచ్చారు అని కార్తీక్ అంటే.. రైట్ అడ్రస్ కే వచ్చాను అని శ్రీధర్ చెప్తాడు. కాంచన నా భార్య, కార్తీక్ నా కొడుకు అని అంటాడు. ఈ బంధాలను ఎప్పుడో తెంచుకుపోయారు అని కార్తీక్ అంటే.. నేను పోలేదు మీరే పొమ్మన్నారు అని శ్రీధర్ అంటాడు. ఇదే తప్పు మీ భార్య చేసుంటే క్షమించేవారా అని శ్రీధర్ ను అనసూయ ప్రశ్నిస్తుంది.
కూతురునే కన్నావు
నాకు నా భార్య అంటే ప్రేమ ఉంది అని శ్రీధర్ అంటాడు. భార్య మీద ప్రేమ ఉన్నోడు మరో ఆడదాని వైపు కన్నెత్తి చూడడు కానీ నువ్వు ఏకంగా కాపురం చేసి కూతురునే కన్నావు అని కార్తీక్ ఫైర్ అవుతాడు. వద్దనుకునే కదా నిన్ను మా జీవితాల్లో నుంచి అమ్మ పొమ్మంది మళ్లీ ఈ దొంగ ప్రేమలు ఎందుకు అని కార్తీక్ నిలదీస్తాడు.
కాంచన నాది దొంగ ప్రేమే కదా.. కార్తీక్ పుట్టిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయింది మళ్లీ లేచి నిలబడలేవు అన్నారు అప్పుడు నిన్ను కించపరిచానా నిన్ను భార్యగా చూడలేదా అని ఎమోషనల్ అవుతాడు శ్రీధర్. ఇప్పుడు అవన్నీ గుర్తు చేయాల్సిన అవసరం ఏముందండీ అంటూ మధ్యలో అడుగుతుంది దీప. మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలుసు నాకు అన్నీ చేసేవారు ఒక తండ్రి కూతురుని చూసుకున్నట్లు చూసుకున్నారు కానీ బాధ ఏంటంటే మీరు నాలాగే మరో ఆడదాన్ని కూడా చూసుకున్నారు అని ఏడ్చేస్తుంది కాంచన.
అవిటిదాన్ని అని
ఆ నిజం నాకు తెలిసిన రోజున నా నరాలను ఎవరో కత్తితో నరుకుతున్నట్లు అనిపించింది, మరో ఆడదానితో నా భర్తను పంచుకోవడం ఏంటీ అని ఏడ్చేశా. అప్పుడే నా కొడుకు ఉంటే చాలు అని అనుకున్నా. నేను అవిటిదాన్ని. కానీ ఎప్పుడూ బాధపడలేదు. మిమ్మల్ని నా జీవితంలో నుంచి పంపించిన తర్వాత మొదటిసారి అవిటిదాన్ని అయ్యాను కానీ కాంచన విలపిస్తుంది.
ఏడ్చేసిన శ్రీధర్
నేను తప్పు చేశాను కాంచన నన్ను నేను అదుపు చేసుకోలేకపోయాను కానీ నీ మీద ప్రేమను ఎప్పుడూ నటించలేదు. అన్నీ పొగొట్టుకుని ఈ ఇంట్లో పడ్డారు. నా వల్ల నువ్వెందుకు బాధ పడాలి. నా వల్ల నువ్వు అనాథలా ఎందుకు బతకాలి అని నేను ఎంత కుమిలిపోయానో తెలుసా. కానీ సాయం చేసేందుకు వస్తున్నా. కాంచన నేను ఏం చేస్తే నా తప్పును క్షమిస్తావో చెప్పు. నీ కాళ్లు పట్టుకోనా అని కాంచన కాళ్లు పట్టుకుంటాడా శ్రీధర్. నీ కాళ్లు పట్టుకునే అర్హత కూడా లేదా అని శ్రీధర్ ఏడ్చేస్తాడు.
కాళ్లు కాదు మాస్టరూ నువ్వు మా పిన్ని మెడలో తాళి కట్టి నా తల్లి గొంతు పట్టుకున్నావ్. నా తల్లి బతికున్నందుకే బాధ పడుతుంది. ఆవిడ బతికుంది కొడుకు కోసమే అని కార్తీక్ అంటాడు. కాదు చివరివరకూ ఉండేది భర్తకు భార్య భార్యకు భర్త అని శ్రీధర్ ఎమోషనల్ డైలాగ్ కొడతాడు. కాంచన నువ్వు కావేరిని చెల్లిగా అనుకుంటున్నావ్, నా కూతురును నీ కూతురిగా చూసుకుంటున్నావ్ వాళ్లతో పాటు నన్ను క్షమించలేవా వాళ్లతో ఉన్నట్లే నాతో ఉండలేవా అని అడుగుతాడు శ్రీధర్.
కలిసి ఉండలేమా
కొడుకు వాళ్ల సంసారం చూసుకుంటాడు. ఈ వయసులో మనకు కావాల్సింది కాస్త ప్రశాంతత. రా కాంచన నువ్వు నేను కావేరీ ముగ్గురం కలిసే ఉందాం లేదంటే చెప్పు కావేరీనే ఇక్కడికి తీసుకొస్తా అని శ్రీధర్ అంటాడు. కాంచన నిర్ణయం తీసుకోవాలని దీప, అనసూయ అంటారు. మనం కలిసి ఉందామని ఒక్క మాట చెప్పు నీకు ఏ బాధలు ఉండవు జ్యోత్స్న కట్టమన్నంత డబ్బు కట్టి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయిస్తాను అని శ్రీధర్ చెప్తాడు. మధ్యలో కార్తీక్ అవసరం లేదంటాడు. చేసిన గాయాలెప్పుడూ పచ్చిగానే ఉంటాయని కార్తీక్ అంటాడు. నన్ను క్షమిస్తానని చెప్పు కాంచన అని శ్రీధర్ అడుగుతుంటే కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం