
ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
నాడు -నేడు కార్యక్రమంలో భాగంగా కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా రూ.కోటి పది లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు గురువారం శంకుస్థాపన నిర్వహించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాడు -నేడు కార్యక్రమాన్ని చేపట్టి ప్రభుత్వ పాఠశాలలు- కళాశాలలు- ఆస్పత్రుల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దేలా అభివృద్ధి చేస్తున్నారని , విద్యార్థుల చదువులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వారికి అవసరమైన అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసేలా పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు ,ఈ కళాశాల ప్రాంగణంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని , ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగిందని , త్వరలోనే మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ,
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ,ఉప సర్పంచ్ , జడ్పిటిసి ,ఎంపీటీసీ సభ్యులు , మండల పార్టీ అధ్యక్షులు , కళాశాల ప్రిన్సిపాల్ , అధ్యాపకులు , పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..