Pallavi Prashant Interview: శివాజీ సపోర్ట్ లేకపోతే టైటిల్ గెలిచేవాడివి కాదా?: పల్లవి ప్రశాంత్ ఏం చెప్పాడంటే..: వీడియో

Best Web Hosting Provider In India 2024

Pallavi Prashant Bigg Boss Buzz Interview: కామన్‍ మ్యాన్‍గా బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍లో అడుగుపెట్టిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. టైటిల్ సాధించి సంచలనం సృష్టించారు. బిగ్‍బాస్ విన్నర్‌ అయ్యారు. రూ.50లక్షల ప్రైజ్‍మనీ (ట్యాక్స్ తర్వాత రూ.35లక్షలు), ఓ కారు, ఓ బంగారు నెక్లెస్ గెలుచుకున్నారు. అయితే, హౌస్ నుంచి బయటికి వచ్చాక బిగ్‍బాస్ బజ్ ఇంటర్య్వూలో పల్లవి ప్రశాంత్ పాల్గొన్నారు. గీతూ రాయల్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వెల్లడైంది. ప్రోమోలో ఏముందంటే..

 

ట్రెండింగ్ వార్తలు

బిగ్‍బాస్ టైటిల్ చేతపట్టుకొని బజ్ ఇంటర్వ్యూకు వచ్చారు పల్లవి ప్రశాంత్. జై జవాన్ అని ప్రశాంత్ అంటే.. జై కిసాన్ అని గీతూరాయల్ అన్నారు. మళ్లొచ్చినా.. తగ్గేదెలే డైలాగ్‍లు చెప్పారు. ఆ తర్వాత తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశారు పల్లవి ప్రశాంత్.

నాగార్జున తన చేయి ఎత్తినప్పుడు, బిగ్‍బాస్ ట్రోఫీ పట్టుకున్నప్పుడు ఎలా అనిపించిందని ప్రశాంత్‍ను గీతూ అడిగారు. “నాకు అయితలేదు అసలు. నేనేనా.. నేనేనా.. అంటూ మాటలు రాలేదు. ఇది నా విజయం కాదు. నాకు ఓటేసి గెలిపించిన ప్రతీ ఒక్కరి విజయం ఇది” అని ప్రశాంత్ అన్నారు.

తనకు క్లోజ్‍గా ఉండే రతిక నామినేట్ చేయడం గురించి కూడా ప్రశాంత్‍ను గీతూ అడిగారు. ఆమెను అక్క అని ఎందుకు పిలవడం స్టార్ట్ చేశావని ప్రశ్నించారు. ఆమెనే అక్క అని పిలవాలని, ఆ తర్వాత వద్దు అని అన్నారు ప్రశాంత్ చెప్పారు. మనస్ఫూర్తిగా ఒక్కసారి అక్క అని పిలిచాక అంతే అని ఆన్సర్ చెప్పారు.

ఇరికించేస్తున్నావ్..

ఒకవేళ ఎవిక్షన్ పాస్ ఇవ్వాల్సి వస్తే శివాజీ, ప్రిన్స్ యావర్‌లో ఎవరికి వాడేవాడివని ప్రశాంత్‍ను గీతూ అడిగారు. అయితే, గురువు లాంటి శివాజీ, క్లోజ్ ఫ్రెండ్ లాంటి యావర్‌ గురించి ఇలాంటి ప్రశ్న రావడంతో ప్రశాంత్ తడబడ్డారు. సమాధానం చెప్పలేకపోయారు. “ఇరికించిండ్రా.. అక్కా గిట్ల ఇరికించావ్” అని నవ్వుతూ అన్నారు ప్రశాంత్.

 

శివాజీ సపోర్ట్ లేకపోతే..

“ఒకవేళ శివాజీ అన్న సపోర్ట్ లేకపోతే నువ్వు గెలిచే వాడివి కాదా?” అని పల్లవి ప్రశాంత్‍ను గీతూ రాయల్ ప్రశ్నించారు. “అన్న (శివాజీ) మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి” అని ప్రశాంత్ అన్నారు. ఆయన భుజం తట్టాడు.. నువ్వు కప్పు కొట్టావ్ అని గీతూ డైలాగ్ వేశారు. “లెటర్ దగ్గరికి వచ్చేసరికి.. వదిన లెటర్ పక్కన పెట్టి.. కామన్ మ్యాన్‍గా వచ్చావ్ నువ్వు గెలవాలే అన్నారు. నా లైఫ్‍లో మొదటిసారి త్యాగం చేసిందంటే శివన్నే” అని పల్లవి ప్రశాంత్ భావోద్వేగంతో అన్నారు.

శివాజీ గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు ప్రశాంత్. విన్ అయ్యాక ఎందుకు ఏడుస్తావ్ ప్రశాంత్ అని గీతూ ఓదార్చారు. “కామన్ మ్యాన్ పవర్ చూపెట్టావ్ అని శివాజీ అన్న ప్రతీసారి నాకు ధైర్యం” అని ప్రశాంత్ అన్నారు. దీంతో ప్రోమో ముగిసింది. ఫుల్ ఇంటర్వ్యూ అతిత్వరలోనే రానుంది.

WhatsApp channel
 
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *