Medak crime : భూమి వివాదంలో తమ్ముణ్ణి హత్య చేసిన అన్న

Medak crime: ఆస్తుల కోసం జరిగే చిన్నచిన్న గొడవలతో రక్త సంబంధాలు మంట కలుస్తున్నాయి. సొంత తల్లి తండ్రులను, అన్నదమ్ముల్ని కడతేర్చిన సంఘటనలు తరచుగా జరగడం ఆందోళన కలిగిస్తుంది.

తమ్ముడిని చంపిన అన్న

Medak crime: మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలంలోని శాలిపేట గ్రామంలో భూమి వివాదంతో సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న ఒక చిన్న భూమి పంచాయితీని మనుసులో పెట్టుకొని సొంత తమ్ముడినే అంతమొందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

వివరాల్లోకి వెళితే, శాలిపేట గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళకు ముగ్గురు కుమారులు సిద్దిరాములు, సత్యనారాయణ, ఆంజనేయులు (42) ఉన్నారు. వారు ముగ్గురు కూడా తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో ఆంజనేయులు గత ఎన్నికల్లో గ్రామ ఉప సర్పంచిగా కూడా ఎన్నికయ్యాడు. సత్యనారాయణ, ఆంజనేయులు మధ్య గత కొంత కాలంగా గట్టు పంచాయతీ నడుస్తున్నది.

పెద్ద మనుషుల సమక్షంలో …

వారిద్దరూ చాల సార్లు, పెద్ద మనుషులతో కూర్చొని సమస్యను పరిష్క రించుకోవడానికి ప్రయత్నం చేసినా.. అందులో సఫలం కాలేదు. బుధవారం ఆంజనేయులు తన పొలానికి నీరు పెట్టటానికి వచ్చాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సత్యనారాయణ అతనితో వాగ్వాదానికి దిగాడు.

తీవ్ర ఆవేశంలో ఉన్న సత్యనారాయణ తన తమ్మునిపై పారతో, ఇనుప రాడ్డుతో దాడికి దిగాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆంజనేయులు ఆర్తనాదాలు విని , పక్కన ఉన్న భూమి వాళ్ళు అక్కడికి పరిగెత్తుకు వచ్చేసరికి రక్తపు మడుగులో పడివున్నాడు. ఆంజనేయులు భార్య లక్ష్మికి, చిన్న శంకరంపేట్ పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు.

లక్ష్మీ తన ఇద్దరు కుమారులతో కలిసి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన భర్తను రక్తపు మడుగులో చూసిన లక్ష్మి, కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కుమారులు ఇద్దరు కూడా ఏడు సంవత్సరాల లోపు వారు కావడంతో, వారికి తండ్రి చనిపోయాడనే విషయం కూడా సరిగా అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నారు.

 

తన భర్తను హత్య చేయటంలో సత్యనారాయణతో పాటు తన అల్లుడు భాను కూడా ఉన్నాడన్నారు. భానుని అక్కడికి తీసుకొస్తే తప్ప, తాము శవాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్ల నివ్వమని లక్షి తరపు బంధువులు అడ్డుకున్నారు.

పోలీసులు వారికి నచ్చచెప్పి, పోలీస్ జాగిలాలను రప్పించి హంతకుల కోసం వెతికారు. విచారణ చేసి హంతకులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో, శవాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్ళడానికి వారు అంగీకరించారు. గ్రామంలో గొడవలు జరగకుండా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Medak crime: ఆస్తుల కోసం జరిగే చిన్నచిన్న గొడవలతో రక్త సంబంధాలు మంట కలుస్తున్నాయి. సొంత తల్లి తండ్రులను, అన్నదమ్ముల్ని కడతేర్చిన సంఘటనలు తరచుగా జరగడం ఆందోళన కలిగిస్తుంది.

తమ్ముడిని చంపిన అన్న

Medak crime: మెదక్ జిల్లాలోని చిన్న శంకరంపేట్ మండలంలోని శాలిపేట గ్రామంలో భూమి వివాదంతో సొంత తమ్ముడిని అన్న హత్య చేశాడు. ఇద్దరి మధ్య ఉన్న ఒక చిన్న భూమి పంచాయితీని మనుసులో పెట్టుకొని సొంత తమ్ముడినే అంతమొందించాడు.

 

ట్రెండింగ్ వార్తలు

వివరాల్లోకి వెళితే, శాలిపేట గ్రామానికి చెందిన శాంతమ్మ అనే మహిళకు ముగ్గురు కుమారులు సిద్దిరాములు, సత్యనారాయణ, ఆంజనేయులు (42) ఉన్నారు. వారు ముగ్గురు కూడా తమకున్న భూమిలో వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఈ క్రమంలో ఆంజనేయులు గత ఎన్నికల్లో గ్రామ ఉప సర్పంచిగా కూడా ఎన్నికయ్యాడు. సత్యనారాయణ, ఆంజనేయులు మధ్య గత కొంత కాలంగా గట్టు పంచాయతీ నడుస్తున్నది.

పెద్ద మనుషుల సమక్షంలో …

వారిద్దరూ చాల సార్లు, పెద్ద మనుషులతో కూర్చొని సమస్యను పరిష్క రించుకోవడానికి ప్రయత్నం చేసినా.. అందులో సఫలం కాలేదు. బుధవారం ఆంజనేయులు తన పొలానికి నీరు పెట్టటానికి వచ్చాడు. అదే సమయంలో అటుగా వచ్చిన సత్యనారాయణ అతనితో వాగ్వాదానికి దిగాడు.

తీవ్ర ఆవేశంలో ఉన్న సత్యనారాయణ తన తమ్మునిపై పారతో, ఇనుప రాడ్డుతో దాడికి దిగాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు అక్కడిక్కడే మృతి చెందాడు. ఆంజనేయులు ఆర్తనాదాలు విని , పక్కన ఉన్న భూమి వాళ్ళు అక్కడికి పరిగెత్తుకు వచ్చేసరికి రక్తపు మడుగులో పడివున్నాడు. ఆంజనేయులు భార్య లక్ష్మికి, చిన్న శంకరంపేట్ పోలీసులకు ఫోన్ చేసి విషయం తెలిపారు.

లక్ష్మీ తన ఇద్దరు కుమారులతో కలిసి పరుగెత్తుకుంటూ వచ్చింది. తన భర్తను రక్తపు మడుగులో చూసిన లక్ష్మి, కన్నీరు మున్నీరుగా విలపించింది. తన కుమారులు ఇద్దరు కూడా ఏడు సంవత్సరాల లోపు వారు కావడంతో, వారికి తండ్రి చనిపోయాడనే విషయం కూడా సరిగా అర్ధం కానీ పరిస్థితిలో ఉన్నారు.

 

తన భర్తను హత్య చేయటంలో సత్యనారాయణతో పాటు తన అల్లుడు భాను కూడా ఉన్నాడన్నారు. భానుని అక్కడికి తీసుకొస్తే తప్ప, తాము శవాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్ల నివ్వమని లక్షి తరపు బంధువులు అడ్డుకున్నారు.

పోలీసులు వారికి నచ్చచెప్పి, పోలీస్ జాగిలాలను రప్పించి హంతకుల కోసం వెతికారు. విచారణ చేసి హంతకులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో, శవాన్ని పోస్టుమార్టానికి తీసుకెళ్ళడానికి వారు అంగీకరించారు. గ్రామంలో గొడవలు జరగకుండా, పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

WhatsApp channel
 

Source / Credits

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *