YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.28-9-2022(బుధవారం) ..
ఘనంగా గుర్రం జాషువా 127 వ జయంతి ..
జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలో దళిత చైతన్య వేదిక -గుర్రం జాషువా కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జాషువా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు , ముందుగా గాంధీ సెంటర్లోని జాషువా విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ,
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా గుర్రం జాషువా రచనలు చేశారని , భారతదేశ కవిత్వానికి ఒక సాధికారిక స్వప్నం కలుగజేసిన మహా వ్యక్తి గుర్రం జాషువా అని తెలిపారు , సామాజిక చైతన్యమే ఇతివృత్తంగా తన రచనలను కొనసాగించారని , సమకాలిన కవిత్వ ఒరవడియైన భావ కవిత్వా రీతి నుండి పక్కకు జరిగి , కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడి , చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా అన్నారు, కళా ప్రపూర్ణ ,కవి కోకిల ,కవిత విశారద ,నవయుగ చక్రవర్తి వంటి బిరుదులు ఆయన గొప్పతనానికి తాత్కారణమన్నారు , అనంతరం జాషువా జయంతి సందర్భంగా పలువురు కవులను ,కళాకారులను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఘనంగా సత్కరించారు ,
ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ వైస్ చైర్మన్ ,కమిషనర్ ,కౌన్సిల్ సభ్యులు , దళిత చైతన్య వేదిక సభ్యులు , పలువురు కవులు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : తాడేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka