Best Web Hosting Provider In India 2024
01 May 2024 10:28 AM

తాడేపల్లి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేడు మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. బుధవారం ఉదయం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మెయిన్రోడ్డు జెండా సెంటర్లో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు పాయకరావుపేటలో సూర్యమహల్ సెంటర్లో జరిగే పబ్లిక్ మీటింగ్లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులో ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు.