Best Web Hosting Provider In India 2024

కృష్ణా: చంద్రబాబు ఎక్కడ పాదం మోపితే అక్కడ కరువు, కష్టాలే అని.. దరిద్రానికి డెఫినిషన్ చంద్రబాబు అని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. రాష్ట్రానికి పట్టిన దరిద్రం చంద్రబాబే అని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్లు ప్రవాసాంధ్రులని ఎద్దేవా చేశారు. నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రజాస్పందన కరువైందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తేల్చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక అజెండా లేకుండా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోందన్నారు. చంద్రబాబు తాను లేస్తే మనిషిని కాదంటాడు.. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటాడు.
మాజీ సర్పంచ్ చేత క్లాస్ పీకించుకున్నాడు. ఇంత కంటే దరిద్రం ఉంటుందా బాబూ… చంద్రబాబు అంటే దరిద్రమని ప్రజలే చెబుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే వానలు పడవు. వైయస్ జగన్ అధికారం చేపట్టాక సమృద్ధిగా వానలు కురుస్తున్నాయని, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా ఉన్నాయని చెప్పారు.