200 మంది టీడీపీ కార్య‌క‌ర్త‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

Best Web Hosting Provider In India 2024

తూర్పు గోదావరి:  టీడీపీకి భారీ షాక్‌ తగిలింది. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో స్థానిక ఖండ్రిగ పేటకు చెందిన సుమారు 200 మంది శెట్టిబలిజలు టీడీపీని వీడి వైయ‌స్ఆర్‌ సీపీలో చేరారు.
గ్రామ పార్టీ అధ్యక్షుడు రావాడ సత్తిబాబు, పార్టీ నేతలు నాతి కుమార్‌ రాజా, వనుం సూరిబాబు, కె.సత్యనారాయణ, వాసంశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలన, వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న ప్రాధాన్యతకు ఆకర్షితులై బీసీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు. ఇప్పటికే 50 శాతం నామినేటెడ్‌ పదవుల కల్పనతో పాటు పలు ఎమ్మెల్సీలు, రాజ్యసభ స్థానాలు బీసీలకు కేటాయించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Best Web Hosting Provider In India 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *