Best Web Hosting Provider In India 2024
రేషన్ కార్డుకు ఆధార్ని లింక్ చేయకపోతే చాలా నష్టం! వెంటనే ఇలా చేయండి..
రేషన్ కార్డుతో ఆధార్ కార్డు లింక్ చేయడం ఇకపై తప్పనిసరి. ఆన్లైన్లో ప్రక్రియను పూర్తి చేయడానికి, నిరంతరాయంగా రేషన్ ప్రయోజనాలను నిర్ధారించడానికి కింద ఇచ్చిన స్టెప్స్ని ఫాలో అవ్వండి.
సబ్సిడీలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా చూడటానికి భారత ప్రభుత్వం.. ఆధార్ కార్డును- రేషన్ కార్డుతో అనుసంధానం చేయడాన్ని తప్పనిసరి చేసింది. మోసపూరిత రేషన్ కార్డుల సమస్యను పరిష్కరించడం, రేషన్ ప్రయోజనాల పంపిణీని మెరుగుపరచడం ఈ చర్యల వెనుక ప్రధాన ఉద్దేశం. లింకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేసి అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో రేషన్ కార్డును ఆధార్ కార్డుతో సులభంగా ఎలా లింక్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి..
రేషన్ కార్డును మీ ఆధార్ కార్డుకు ఇలా లింక్ చేసుకోండి..
స్టెప్ 1: మీ రాష్ట్ర అధికారిక ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) వెబ్సైట్ని సందర్శించండి. ఆధార్ లింకింగ్ కోసం సంబంధిత విభాగాన్ని యాక్సెస్ చేయడానికి మీరు మీ ఆధారాలను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
స్టెప్ 2: లాగిన్ అయిన తర్వాత, మీ ఆధార్ను మీ రేషన్ కార్డుకు లింక్ చేసే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని ఎంచుకోండి. మీ ఆధార్, రేషన్ కార్డు నెంబర్ల వివరాలను నమోదు చేయమని మిమ్మల్ని అడుగుతారు.
స్టెప్ 3: అవసరమైన సమాచారాన్ని ఎంటర్ చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) వస్తుంది. మీ గుర్తింపును ధృవీకరించడానికి, లింకింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటిపిని నమోదు చేయండి. ఆధార్, రేషన్ కార్డు లింకింగ్ విజయవంతమైందని సూచిస్తూ మీ ఫోన్కి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది.
రేషన్ కార్డులో జాబితా చేసిన కుటుంబ సభ్యులందరూ రేషన్ ప్రయోజనాలను పొందడంలో అంతరాయం కలగకుండా ఉండటానికి వారి ఆధార్ని అనుసంధానం చేయాలని గమనించడం ముఖ్యం. ఆధార్ అథెంటికేషన్, మొబైల్ నెంబర్, ఫింగర్ ప్రింట్ వెరిఫికేషన్తో కూడిన తప్పనిసరి కేవైసీ (నో యువర్ కస్టమర్) వెరిఫికేషన్ని కూడా ప్రభుత్వం అమలు చేసింది.
రేషన్ కార్డుతో ఆధార్ని అనుసంధానించడంతో పాటు, ఆధార్ కార్డుపై పేరు, చిరునామా లేదా పుట్టిన తేదీ వంటి వ్యక్తిగత వివరాలను ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేయడానికి యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) అవకాశం కల్పించింది. మొదట డిసెంబర్ 14, 2024తో ముగియాల్సిన ఈ సదుపాయాన్ని ఇప్పుడు జూన్ 14, 2025 వరకు పొడిగించారు. ఇది పౌరులకు అవసరమైన అప్డేట్స్ చేయడానికి మరింత సమయం ఇస్తుంది.
కేవైసీ ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైతే మీ రేషన్ కార్డు రద్దు కావచ్చు! అందువల్ల, రేషన్ సరఫరాలో అంతరాయాలను నివారించడానికి ఈ ఫార్మాలిటీలను పూర్తి చేయడం చాలా అవసరం.
సంక్షేమ పథకాలను క్రమబద్ధీకరించడానికి, మోసాలను నిర్మూలించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆధార్-రేషన్ కార్డు అనుసంధానం జరిగింది. అర్హులైన వ్యక్తులు మాత్రమే ప్రయోజనం పొందేలా చూడటం ద్వారా, ప్రభుత్వ వనరుల పంపిణీలో పారదర్శకతను పెంచడం ఈ కార్యక్రమం లక్ష్యం.
Best Web Hosting Provider In India 2024
Source link