తెలుగు డైరెక్టర్ తీసిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. 120 కోట్ల కలెక్షన్లు..ఓటీటీలోకి ఎప్పుడంటే?

Best Web Hosting Provider In India 2024

తెలుగు డైరెక్టర్ తీసిన బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. 120 కోట్ల కలెక్షన్లు..ఓటీటీలోకి ఎప్పుడంటే?

 

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో డైరెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ జాట్ ఓటీటీ రిలీజ్ కు రంగం సిద్ధమైంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. ఎక్కువ మంది తెలుగు టెక్నీషియన్స్ పని చేసిన ఈ మూవీ ఏ ఓటీటీలో ఎప్పుడు వస్తుందో చూసేయండి.

 
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ 
 

డాన్ శీను, బలుపు, క్రాక్, వీర సింహా రెడ్డి లాంటి బ్లాక్ బస్టర్లను అందించిన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతోంది. గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ యాక్షన్ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను అలరించేందుకు డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అయింది. ఆ మూవీనే.. ‘జాట్’. సన్నీ డియోల్ హీరోగా యాక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో అదరగొట్టింది. ఇప్పుడు ఓటీటీ బాట పట్టనుంది.

 

ఎప్పుడంటే?

తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీ ‘జాట్’. ఈ సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. యాక్షన్ థ్రిల్ర్ గా రిలీజైన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన జాట్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఈ మూవీ జూన్ 6న ఓటీటీలోకి రాబోతుంది.

ఆ ఓటీటీలోనే

జాట్ సినిమా ఓటీటీ బాట పట్టింది. ఈ మూవీ జూన్ 6న డిజిటల్ స్ట్రీమింగ్ కు రానుంది. ఈ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే నెట్‌ఫ్లిక్స్‌లో జాట్ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఇప్పుడైతే ఈ మూవీ హిందీలోనే అందుబాటులోకి రానుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ఓటీటీలో కచ్చితంగా ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేసే అవకాశముంది.

అంతా తెలుగువాళ్లే

పేరుకే జాట్ బాలీవుడ్ సినిమా.. కానీ దీని కోసం పని చేసిన టెక్నిషియన్స్ లో ఎక్కువ శాతం తెలుగు వాళ్లే. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టగా.. ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు. శ్రీవినాస్ గవిరెడ్డి, కుందన్ పాండేతో కలిసి గోపీచంద్ మలినేని స్క్రీన్ ప్లే బాధ్యతలూ చూసుకున్నారు. సౌరభ్ గుప్తాతో కలిసి సాయి మాధవ్ బుర్రా డైైలాగ్స్ రాశారు. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ కలిసి మూవీ నిర్మించాయి. నవీన్ నూలి ఎడిటర్.

 

మాస్ ఎలివేషన్లు

జాట్ మూవీలో మాస్ ఎలివేషన్లు ఓ రేంజ్ లో ఉన్నాయి. హీరోగా సన్నీ డియోల్ అదరగొట్టారు. విలన్ గా రణదీప్ హుడా కూడా సత్తాచాటారు. రెజీనా కసాండ్రా, సయామి ఖేర్, వినీత్ కుమార్ తదితరులు కీ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీ స్టోరీ ఆంధ్రప్రదేశ్ లోనే సాగుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకూ అత్యధిక గ్రాస్ కలెక్షన్లు రాబట్టిన ఆరో బాలీవుడ్ సినిమాగా జాట్ కొనసాగుతోంది.

 

Best Web Hosting Provider In India 2024