



Best Web Hosting Provider In India 2024
టూ వీలర్స్ మీద టోల్ వసూలు ఆలోచన లేదు.. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా క్లారిటీ
మరికొన్ని రోజుల్లో ద్విచక్ర వాహనాలకు సైతం టోల్ ఫీజులు వసూలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) క్లారిటీ ఇచ్చింది.
జులై 15 నుంచి భారతదేశంలోని ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. ఎంతో కాలంగా ఫ్రీగా వెళ్తున్న మినహాయింపు టూ వీలర్స్కు ఉండదని వార్తలు వచ్చాయి. దీనిపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పందించింది. ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజును ప్రవేశపెట్టడం లేదని, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేశాయని పేర్కొంది.
జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవే ఎంట్రీ పాయింట్ల వద్ద టోల్ ఫీజు ఉంటుందని ప్రచారం జరిగింది. FASTag ద్వారా డిజిటల్ టోల్ వసూలు వ్యవస్థ పరిధిలోకి ద్విచక్ర వాహనాలను తీసుకురావాలనే లక్ష్యంతో ప్రధాన మార్పును తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటోందని వార్తలు వచ్చాయి.
అంతేకాదు ఇప్పుడు FASTag ద్వారా టోల్ వసులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోందని కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం గురించి అధికారికంగా ప్రభుత్వ నోటిఫికేషన్ ఏది ఇవ్వలేదు. ద్విచక్ర వాహన యజమానులు ఫాస్ట్ ట్యాగ్ తీసుకోవాల్సి ఉంటుందని, దానిని వారి బ్యాంక్ ఖాతా లేదా డిజిటల్ వాలెట్కు లింక్ చేయాలని ప్రచారం చేశారు. కానీ ఈ విషయాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖండించింది.
‘కొన్ని మీడియా సంస్థలు ద్విచక్రవాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయనున్నట్టుగా వార్తలు పబ్లిష్ చేశాయి. టూ వీలర్స్ మీద టోల్ వసూలు చేసే ఆలోచన లేదు. అలాంటి ప్రతిపాదన ఏది జరగలేదు. ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలు వసూలు లేదు.’ అని NHAI చెప్పింది.
నిజానికి మాన్యువల్ టోల్ వసూలు స్థానంలో డిజిటల్ వ్యవస్థలు రావడంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడంతో ప్రయాణం సులభతరం అయిందనే చెప్పాలి. ఇటీవలే పెద్ద వాహనాలకు వార్షిక టోల్ పాస్ రూ. 3,000గా తీసుకువచ్చారు. ఈ స్కీమ్ ద్వారా వాహనదారులకు కొన్ని ప్రయోజనాలు దక్కనున్నాయి.
Best Web Hosting Provider In India 2024
Source link