అట్లుంటది కోహ్లి, రోహిత్ క్రేజ్.. 4 నెలల ముందుగానే వన్డే మ్యాచ్ టికెట్లు సోల్ట్ ఔట్.. హాట్ కేకుల్లా అమ్మకం

Best Web Hosting Provider In India 2024


అట్లుంటది కోహ్లి, రోహిత్ క్రేజ్.. 4 నెలల ముందుగానే వన్డే మ్యాచ్ టికెట్లు సోల్ట్ ఔట్.. హాట్ కేకుల్లా అమ్మకం

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ క్రేజ్ ఏంటో మరోసారి స్పష్టమైంది. వీళ్లు ఆడనున్న ఓ వన్డే మ్యాచ్ టికెట్లు నాలుగు నెలలకు ముందే పూర్తిగా అమ్ముడయ్యాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి (AFP)

విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ.. ఈ టీమిండియా స్టార్లకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్లను చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియాలకు ఎగబడతారు. అలాంటిది టీ20, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన వీళ్లు కేవలం వన్డేల్లోనూ ఆడబోతున్నారు. వన్డే జెర్సీల్లోనే స్టేడియంలో కనిపించబోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా వన్డే మ్యాచ్ ను వదుకోవడానికి ఎవరు మాత్రం ఇష్టపడతారు. అందుకే రోహిత్, కోహ్లి ఆస్ట్రేలియాలో ఆడబోతున్న వన్డే సిరీస్ పై అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఆ మ్యాచ్ టికెట్లు ఖాళీ

ఆస్ట్రేలియా సిరీస్ కోసం టీమిండియా ఆ దేశానికి వెళ్లనుంది. అక్టోబర్-నవంబర్ మధ్య ఈ సిరీస్ జరుగుతుంది. లిమిటెడ్ ఓవర్ల సిరీస్ లో ఈ రెండు జట్లు తలపడతాయి. ఈ వన్డే సిరీస్ లో రోహిత్, కోహ్లి ఆడబోతున్నారు. దీంతో ఈ సిరీస్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇందులో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో జరిగే మూడో వన్డేకు తొలి బంతి వేయడానికి నాలుగు నెలల ముందే టికెట్లు అమ్ముడుపోవడం విశేషం.

రెండు మ్యాచ్ లు

ఆస్ట్రేలియా, భారత్ మధ్య లిమిటెడ్ ఓవర్ల సిరీస్ లో భాగంగా సిడ్నీలో జరిగే వన్డే, కాన్ బెర్రాలో జరిగే టీ20 మ్యాచ్ టికెట్లు మొత్తం అమ్ముడు పోయాయని క్రికెట్ ఆస్ట్రేలియా ధృవీకరించింది. భారత్ తరఫున కేవలం వన్డే క్రికెట్ మాత్రమే ఆడే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్టార్ పవర్ కు ఇది నిదర్శనం. మైదానంలో ఇద్దరు దిగ్గజాలను కలిసి కేవలం వన్డేల్లోనే చూడగలం కాబట్టి టికెట్లకు డిమాండ్ నెలకొంది.

కెరీర్ ఎండింగ్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కెరీర్ ఎండింగ్ లో ఉన్నారు. ఇప్పటికే టీ20, టెస్టులకు వీడ్కోలు పలికారు. వన్డేల్లోనూ వాళ్ల కెరీర్ ముగింపు దశలోనే ఉంది. దీంతో ఈ ఇద్దరు ఆడే మ్యాచ్ లు తక్కువే. దీంతో టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. క్రికెట్ ఆస్ట్రేలియా ఈవెంట్స్ అండ్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ జోయెల్ మోరిసన్ మాట్లాడుతూ.. “రోహిత్, కోహ్లీ వంటి దిగ్గజాలను ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో ప్రవాస భారతీయులున్నారు. సిడ్నీ వన్డేలో బ్లాక్ బస్టర్ కు కావాల్సిన అన్ని అంశాలు ఉన్నాయి’ అని అన్నాడు. భారత్ ఆర్మీ, ఫ్యాన్స్ ఇండియా వంటి అభిమాన సంఘాలు ఇప్పటికే వేల సంఖ్యలో టికెట్లను కొనుగోలు చేశాయి.

90 వేల టికెట్లు

ఆస్ట్రేలియా, భారత్ సిరీస్ అక్టోబర్ 19న పెర్త్ లో ప్రారంభమై నవంబర్ 8న బ్రిస్బేన్ లో జరిగే చివరి టీ20తో ముగుస్తుంది. సిరీస్ అంతటా కలిసి ఇప్పటికే 90,000 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఇద్దరు దిగ్గజాలను చూసేందుకు ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన ఈ స్టార్లు.. గత నెలలో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం


Best Web Hosting Provider In India 2024


Source link