




Best Web Hosting Provider In India 2024

ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ వాయిదా – మళ్లీ ఎప్పట్నుచంటే…?
ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు సాంకేతి విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేసింది. జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని తాజా ప్రకటన ద్వారా వెల్లడించింది. ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసింది. ఇందులో భాగంగా జూన్ 20వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. కానీ సాంకేతి విద్యాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. కళాశాలలకు అనుమతుల జారీలో జాప్యం జరుగుతుండడంతో వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
జూన్ 30 నుంచి వెబ్ ఆప్షన్లు….
జూన్ 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది. ప్రస్తుతం ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు మాత్రం జూన్ 30వ తేదీ నుంచే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందుకోసం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ. 700, ఎస్సీ, ఎస్టీ వాళ్లు రూ. 250 చెల్లించాలి.
ర్యాంకుల ఆధారంగా సీట్లు…
ఫీజు చెల్లించే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత… కాలేజీల కోసం వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. మీ ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అలాట్ మెంట్ కాపీని https://polycet.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి పొందవచ్చు. హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవాలి.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com కు మెయిల్ చేయవచ్చు. ఇక 7995681678, 7995865456, 9177927677 హెల్ప్ లైన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
గత నెలలోనే ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో పాల్గొననున్నారు.
సంబంధిత కథనం
టాపిక్