టంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు!

Best Web Hosting Provider In India 2024


టంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో.. తండ్రిని కాల్చి చంపిన కొడుకు!

Sharath Chitturi HT Telugu

దిల్లీకి చెందిన ఓ వ్యక్తి, తన తండ్రిని చంపేశాడు! ఇల్లు షిఫ్టింగ్​ సమయంలో టెంపోలో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో తుపాకీతో తండ్రిని కాల్చి హత్య చేశాడు.

దిల్లీలో తండ్రిని చంపిన కుమారుడు.. (Unsplash/Representational Image)

దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. టెంపో వెహికిల్​లో ముందు సీటు ఇవ్వలేదన్న కోపంతో, ఓ 26ఏళ్ల వ్యక్తి, తన తండ్రిని కాల్చి చంపేశాడు!

ఇదీ జరిగింది..

ఉత్తర దిల్లీ తిమర్​పుర్​ అనే ప్రాంతంలోని ఎంఎస్​ బ్లాక్​ వద్ద గురువారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో జరిగింది ఈ ఘటన. 60ఏళ్ల సురేంద్ర సింగ్​ సీఐఎస్​ఎఫ్​ సబ్​-ఇన్​స్పెక్టర్​గా ఇటీవలే రిటైర్​ అయ్యాడు. అనంతరం, తన కుటుంబాన్ని దిల్లీ నుంచి ఉత్తరాఖండ్​లోని స్వస్థలానికి షిఫ్ట్​ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం ఒక టెంపోని మాట్లాడాడు.

టెంపోలో సామాన్లు ఎక్కిస్తుండగా.. కుమారుడు దీపక్​తో సురేంద్ర సింగ్​కి వాగ్వాదం మొదలైంది. ఫ్రెంట్​ సీటులో ఎవరు కూర్చోవాలి? అన్న విషయంపై ఇద్దరు గొడవపడినట్టు తెలుస్తోంది.

ఇంతలో దీపక్​ అగ్రెసివ్​ అయ్యాడు. తండ్రి లైసెన్స్​డ్​ గన్​ వెతికి, తీసుకొచ్చి, సురేంద్ర సింగ్​పై కాల్పులు జరిపాడు.

అక్కడే ఉన్న స్థానికులు ఒక్కసారిగా షాక్​కి గురయ్యారు. దీపక్​ మీద పడి, అతడి నుంచి గన్​ని లాక్కునే ప్రయత్నం చేశారు.

అయితే, ఈ ఘటన జరిగిన వీధి నుంచి కొంత దూరంలో పోలీసు పాట్రోలింగ్​ వెహికిల్​ ఉంది. కాల్పుల శబ్దం వినిపించగానే పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీశారు.

రక్తపుమడుగులో పడి ఉన్న సురేంద్ర సింగ్​ని పోలీసులు చూశారు. గన్​ పట్టుకుని అక్కడే నిలబడ్డ దీపక్​ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

ఆ వెంటనే సురేంద్ర సింగ్​ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్థరించారు.

భార్యను చంపిన 75ఏళ్ల వృద్ధుడు..!

దేశంలో నేరాలు రోజురోజుకు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. ఓ 75ఏళ్ల వృద్ధుడు, తన భార్యను దారుణంగా చంపిన ఘటన బెంగళూరులో ఇటీవలే చోటుచేసుకుంది.

నిందితుడి పేరు రంగయ్య. ఆయనకు చిన్న కిరాణ కొట్టు ఉంది. వంటి విషయంలో భార్య తిమ్మమ్మతో ఎప్పుడు గొడవపడే వాడు. గురువారం భార్యతో వివాదం ముదిరింది. ఇంతలో కత్తి తీసుకున్న రంగయ్య భార్యపై దాడి చేశాడు. ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయంది. నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

రంగయ్య దగ్గర ఫోన్​ లేకపోవడంతో ఆయన్ని ట్రాక్​ చేయడం కష్టంగా మారింది. అయితే, ఆయన తరచూ తిరుపతికి వెళుతుంటాడని రంగయ్య కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాల్లోని బస్​ స్టాండ్​లపై నిఘా పెట్టారు.

కొన్ని గంటల తర్వాత నిందితుడిని రామనగరలోని బస్​ స్టాండ్​ దగ్గర అరెస్ట్​ చేశారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link