Hyderabad Aragen Investment : హైదరాబాద్ లో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు, 1500 మందికి ఉపాధి-ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ ప్రకటన

Best Web Hosting Provider In India 2024

Hyderabad Aragen Investment : తెలంగాణకు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి…దావోస్ పర్యటన కొనసాగుతోంది. దావోస్ లో ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ డైరెక్టర్, సీఈవో మన్ని కంటిపూడితో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. హైదరాబాద్ కేంద్రంగా తమ సేవలు విస్తరిస్తామని ఆరాజెన్ ప్రతినిధులు తెలిపారు. మల్లాపూర్ లో ప్రస్తుత ప్లాంట్ ను రూ.2,000 కోట్ల విస్తరిస్తామని తెలిపారు. కొత్తగా 1,500 కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రణాళికలను ఆరాజెన్ ప్రకటించింది. ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ విస్తరణలో భాగంగా సీఆర్వో (కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్) కేంద్రంగా హైదరాబాద్ ప్లాంట్ ను మరింత పటిష్టం చేస్తామని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. కొత్త డ్రగ్స్, డివైజ్‌లను కనుగొనడం, అభివృద్ధి చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా 1,000 మందికి పైగా ఆవిష్కర్తలకు హైదరాబాద్ కేంద్రంగా మారిందన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు

కొత్త మాలిక్యులర్ ఎంటీటీల ఆవిష్కరణ, అభివృద్ధిపై దృష్టి సారించి, డ్రగ్ డెవలప్‌మెంట్ కంటిన్యూమ్‌లో కాంట్రాక్ట్ రీసెర్చ్, డెవలప్‌మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ సేవలను అందించడంలో ఆరాజెన్ 20 సంవత్సరాల అనుభవాన్ని కలిగి ఉందని ఆ సంస్థ సీఈవో మన్ని కంటిపూడి తెలిపారు. పెద్ద ఫార్మా లేదా బయోటెక్, ఒక వ్యవసాయ రసాయనాలు లేదా జంతు ఆరోగ్య సంస్థ అయినా, ఆరాజెన్ బయోఫార్మా…. వనరులను సృష్టించే సామర్థ్యాలను కలిగిఉందన్నారు.

హైదరాబాద్ లో పెట్టుబడులపై సీఎం హర్షం

ఈ సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో గ్లోబల్ లీడర్‌గా ఉన్న ఆరాజెన్ లైఫ్ సైన్సెస్ హైదరాబాద్‌లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఎంచుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అసాధారణమైన మౌలిక సదుపాయాలను నిర్మించాలనే నూతన ప్రభుత్వ సంకల్పాన్ని నిదర్శనం అన్నారు. మన్ని కంటిపూడి మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల విస్తరణ ప్రణాళికల గురించి చర్చించామన్నారు. హైదరాబాద్‌లో రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌ సీఆర్వోలు, సీడీఎంవోలకు ప్రధాన కార్యాలయంగా మారుతుందన్నారు. హైదరాబాద్‌లో ఆధునిక మౌలిక సదుపాయాలు, దేశంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తల ప్రతిభ, బలమైన నెట్‌వర్క్, డిజిటల్ టెక్నాలజీలో ఆవిష్కరణలకు అవకాశం కల్పించే పర్యావరణ వ్యవస్థను అందిస్తున్నామని ఆయన చెప్పారు.

 

“తెలంగాణలో ఈ పరిశ్రమ అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందడం మనం చూస్తూనే ఉన్నాం. మా విస్తరణ ప్రణాళికలకు బలమైన మద్దతు, ఆమోదం తెలిపినందుకు తెలంగాణ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రాబోయే రోజుల్లో మా లక్ష్యాలను పూర్తి చేస్తాం” అని మన్ని కంటిపూడి అన్నారు.

పారిశ్రామికవేత్తలతో భేటీ

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సీఎం రేవంత్‌రెడ్డి మూడో రోజు పర్యటిస్తు్న్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతం అదానీ, టాటాసన్స్‌ ఛైర్మన్‌ చంద్రశేఖరన్‌తో సీఎం భేటీ అయ్యారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ ఛైర్మన్‌ సజ్జన్‌ జిందాల్‌, గ్లోబల్‌ హెల్త్‌ స్ట్రాటజీ వైస్‌ ప్రెసిడెంట్‌ విలియం వార్‌, వీఆర్‌ఎల్‌డీసీ ప్రతినిధులను సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి… తెలంగామలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు.

WhatsApp channel
 

టాపిక్

 
Telangana NewsHyderabadCm Revanth ReddyInvestmentTrending Telangana

Source / Credits

Best Web Hosting Provider In India 2024